1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

29, అక్టోబర్ 2011, శనివారం

నాగులచవితి



---------- Forwarded message ----------
From: Gurukrupa <gayathrisvr@gmail.com>
Date: 2011/10/29
Subject: Gurukrupa
To: prasadrao.sreenivas@gmail.com


Gurukrupa


నాగులచవితి

Posted: 28 Oct 2011 09:59 AM PDT

మన దేశంలో అతిప్రాచీనమైన పూజ నాగారాధన. ఇంద్రునికి శతృవైన వృత్రుడు నాగజాతివాడు, సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు విష్ణువుకు శయనంగా అమరినవాడు, శివుడు నాగాభరణుడు, ఈ భూమికి ఆధారం వాసుకి అనే సర్పం, మన రాష్ట్రంలో శ్రావణ శుద్ధపంచమినాడు నాగపంచమి, కార్తీకశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం.

ఆశ్లేషనక్షత్రానికి అధిష్టానదేవత సర్పం, నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది.
వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు
పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది.

వృశ్చికరాశిలో జ్యేష్టానక్షత్రం సర్పనక్షత్రం, ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగులచవితి. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వార ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు, కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.
You are subscribed to email updates from Gurukrupa
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610




Love all - Serve all


"Amma" Srinivas

9177999263

www.aswa.tk

www.sri4u.tk

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.


27, అక్టోబర్ 2011, గురువారం

కార్తీక మాసం


Gurukrupa


కార్తీక మాసం

Posted: 26 Oct 2011 10:11 AM PDT

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

కార్తీకమాసంలో నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు
కార్తీకమాసంలో తెల్లవారుజామున తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీకమాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు. తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందనీ, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న ఆదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ వ్రత విధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి, పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవ్వాలి. నక్షత్రాలు ఉండగానే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కేదారేశ్వర వ్రతం
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే వారు కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తూ నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
You are subscribed to email updates from Gurukrupa
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610




Love all - Serve all


"Amma" Srinivas

9177999263

www.aswa.tk

www.sri4u.tk

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.


FW: on 30th October, 2011 9AM - 12PM

Blood cannot be manufactured it can only generated by generous donors….Be a Blood Donor & Save a Life

Hi Friends,

It’s only 3 more days to go for a Blood Donation Camp for Thalassemia Children.  I received only one response (excluding my response)

We are planning to conduct the Group Blood Donations on 30th October, 2011 at the same venue. 

Our 450 Ml of Blood will give a few days of life to Thalassemia Children.

Please click the below if you are interested to donate blood for a noble cause.


Expecting more DONORS to support innocent Thalassemia Children

Survival of Thalassemia patients depends upon repeated blood transfusion and costly medicines. They Need blood for every 10-15 days.
Love all-Serve all
AMMA Srinivas

9177999263 



 
Please be ready and prepare mentally & physically for BLOOD DONATION for Thalassemia Children on 30th October, 2011 @ 9AM

Those who missed the last time can join and avail the opportunity to serve the God (i.e. little children of Thalassemia)
Please Note: Mostly program will not change, but may be a change if conditions in the City are not supporting

Help @ 9177999263


Love all-Serve all
AMMA Srinivas

Thalassemia: Thalassemia is an inherited blood disorder in which the body is unable to make adequate hemoglobin. Hemoglobin is present in the red cells and is made from proteins. Normally red cells survive for 120 days but in Thalassemia red cell survival is reduced.  Survival of Thalassemia patients depends upon repeated blood transfusion and costly medicines. They Need blood for every 10-15 days.

25, అక్టోబర్ 2011, మంగళవారం

వరాహపురాణంలో వేంకటాచల విశేషాలు (1)



---------- Forwarded message ----------
From: Gurukrupa <gayathrisvr@gmail.com>
Date: 2011/10/10
Subject: Gurukrupa
To: prasadrao.sreenivas@gmail.com


Gurukrupa


వరాహపురాణంలో వేంకటాచల విశేషాలు (1)

Posted: 08 Oct 2011 04:30 PM PDT

శ్రీ వేంకటాచలం గురించి, ఆ బ్రహ్మాండనాయకుని గురించి ఎంత చెప్పినా మాటలు చాలవు. వేంకటాచల మహత్యం అనేక పురాణాల నుండి సంగ్రహింపబడినప్పటికీ వరాహపురాణం విస్తారంగా అభివర్ణించినది. వరాహపురాణం మహాపురాణాలలోనిది. ఈ పురాణమునందు 218 అధ్యాయాలు, 24,000 శ్లోకాలు ఉన్నాయి. వేంకటాచల మహత్యం ఎక్కువ అధ్యాయాలలో(40 అధ్యాయాలు) వర్ణించిన పురాణం వరాహ పురాణం మాత్రమే.

శ్వేతవరాహ వృత్తాంతం :
శ్రీమన్నారాయణుడు, శ్వేతవరాహ రూపంలో పాతాళమున ఉన్న హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. తరువాత కొంతకాలము భూమిపైనే నివాసం ఏర్పర్చుకోదల్చి, వైకుంఠమునుండి గరుడుని ద్వారా "క్రీడాద్రి" (వేంకటాద్రి) ని భూమికి తెప్పించాడు. ఈ పర్వతమునే కృతయుగములో అంజనాద్రి అని, త్రేతాయుగములో నారాయణాద్రి అని, ద్వాపరయుగములో సింహాద్రి అని, కలియుగములో శ్రీవేంకటాచలమని పేరుగాంచినది. పవిత్ర వేంకటాచలములో అనేక తీర్ధాలు ఏర్పడినవి, ప్రతీ తీర్ధానికి ప్రత్యేక ఇతిహాససంబంధం కూడా ఉన్నట్లు ఇక్కడ తెలియచేయబడినది.

స్వామిపుష్కరిణి :

కొండపైన ఉన్న పుష్కరిణి మానవనిర్మితం కాదు. అది స్వయంవ్యక్త క్షేత్రం కనుక పుష్కరిణి కూడ స్వయంవ్యక్తమైనది. "స్వామి పుష్కరిణి" అనే ప్రసిద్ధి, వెంకటాద్రియందున్న మూడుకోట్ల తీర్ధాలలో. ఈ ఒక్క తీర్ధానికే దక్కింది. ఈ పుష్కరిణి గురించి వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలు పేర్కొన్నాయి.
శ్వేతవరాహ రూపంలో ఉన్న విష్ణువు ఆఙ్ఞానుసారం గరుడుడు, వైకుంఠము నుండి "క్రీడావాపిని" భూలోకానికి తెచ్చెను. ఇది గంగాది తీర్ధాలకు ఉత్పత్తిస్థానమని శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలియకముందే స్వామి పుష్కరిణి ఆవిర్భవించింది అని వరాహపురాణం ప్రతిపాదిస్తున్నది. దీన్ని గురించిన ప్రస్తావన అంటే ఎప్పుడు/ఎలాగ ఆవిర్భవించింది అనే దాని గురించి ఏ పురాణంలోను ప్రస్తావించలేదు.

బ్రహ్మోత్సవ వైభవం :

బ్రహ్మ శ్రీవారిని సేవించుటకు వేంకటాచలానికి వచ్చి, అక్కడే కొంతకాలం ఉండెను. తరువాత స్వామి వారి ఆఙ్ఞతో వేంకటాద్రి యందు బ్రహ్మోత్సవం చేయడం ప్రారంభించెను. సౌరమానమును అనుసరించి, సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినకాలం కన్యామసమందురు. ఈ కన్యామాసంలో ధ్వజారోహణం చేస్తారు.
ఈ బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం చూడటానికి దేవతలు విచ్చేసిరి. బ్రహ్మ ఆఙ్ఞానుసారం విశ్వకర్మ అన్నశాలలను, నివాసభవనాలను, పుర వీధులను ఏర్పాటు చేసాడు.
ఉత్సవ సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశుడు సమస్త వాద్యఘోషలతో, ఛత్రచామరలు, కవులు, వాద్యములు, వేదపండితులు వెంటరాగా, ఊరేగింపుగా వెళ్ళెను. ప్రతిరోజు వైఖానస ఆగమశాస్త్రవిధి ప్రకారం యాగశాలలో హోమం మొదలైన వైదికకర్మలన్ని జరుగును. బ్రహ్మోత్సవానంతరం తిరుమలేశుడు బ్రహ్మను పిలిచి " నీవు అత్యంత భక్తితో జరిపించిన ఈ బ్రహ్మోత్సవము నాకెంతో తృప్తిని కలిగించినది. ప్రతీ సంవత్సరము కన్యామాసంలో బ్రహ్మోత్సవాన్ని ఈ విధంగానే నిర్వహించినవారు బ్రహ్మలోకాన్ని పొందుదురు" అని వరమిచ్చెను.
బ్రహ్మోత్సవం మొట్టమొదట కల్పారంభంలో బ్రహ్మచే ఆచరింపబడి, ఇప్పటికీ ప్రతీఏడు జరుగుతున్నది.

పద్మావతమ్మ జననం

ఆకాశరాజు యఙ్ఞము చేయదలచి అరణీనదీ తీరంలో బంగారు నాగలితో కర్షణము చేయిస్తూ తాను నవధాన్యములు చల్లుచుండెను. ఇంతలో పద్మశయ్యపై పరుండి బంగారు బొమ్మవలే ఉన్న బాలిక ఆ భూమిపై కనపడెను. ఆ సమయంలోనే ఆకాశవాణి ఇలా పలికింది " ఈ బిడ్డ నీ బిడ్డ, ఈమెను నీవు పెంచుము"అని. ఆకాశరాజు సంతసించి భార్య అయిన ధరణీదేవి తో సంతోషముగా పద్మావతిని పెంచి పెద్దచేసెను.
ఒకరోజు పద్మావతి చెలికత్తెలతో కలిసి ఉద్యానవనమునకు వెళ్ళింది. అంతలో ఒక మదపుటేనుగు అటుగా రావడంతో అందరూ భయంతో చెట్టుచాటున దాగిరి. ఆ సమయంలోనే ఆజానుబాహుడు, పద్మాక్షుడు అయిన వేంకటేశ్వరుడు అటు రాగ, ఆ ఏనుగు శ్రీనివాసునికి నమస్కరించి అడవిలోకి వెళ్ళిపోయింది.
అప్పుడు వేంకటేశ్వరుడు పద్మావతిని చూస్తూ, "ఈమె ఎవరు?"అని ప్రశ్నించగా "ఈమె ఆకాశరాజు, ధరణీదేవిల ముద్దల కొమరిక. నిన్ను ఇక్కడ ఆకాశరాజు చూచినచో కారాగారమున బంధించును. కనుక ఇచ్చటనుండి త్వరగా వెళ్ళుము" అని చెల్లికత్తెలు సమాధానమిచ్చిరి. శ్రీనివాసుడు తిరిగి వేంకటాద్రికి వెళ్ళిపోయాడు
ముక్తాగృహానికి చేరిన శ్రీనివాసుడు పరధ్యానముగా ఉండుట గమనించిన వకుళామాత, శ్రీనివాసుడి ద్వార పద్మావతి విషయమును తెలుసుకొనెను. తనకు పద్మావతితో వివాహము జరిపించమని వకుళను అడుగగా, వకుళ ఆకాశరాజు ఉండు నారాయణపురమునకు శ్రీనివాసుని ద్వార దారి తెలుసుకొని, నారాయణపురం చేరెను. ధరణీదేవిని కలుసుకొని, స్వపరిచయం చేసుకొని, ఉద్యానవనంలో జరిగిన పద్మావతీ శ్రీనివాసుల కలయిక గురించి వివరంగా చెప్పింది.
You are subscribed to email updates from Gurukrupa
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610



--

Love all - Serve all


"Amma" Srinivas

9177999263

www.aswa.tk

www.sri4u.tk

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.


వ్యాసభగవానుడు



---------- Forwarded message ----------
From: Gurukrupa <gayathrisvr@gmail.com>
Date: 2011/10/19
Subject: Gurukrupa
To: prasadrao.sreenivas@gmail.com


Gurukrupa


వ్యాసభగవానుడు

Posted: 18 Oct 2011 12:49 PM PDT

పరాశర్యం పరం పురుషం విశ్వవేదైకయోనిం
విశ్వాధారం విబూధ వినుతం వేదవేదాంతవేద్యం
శశ్వచ్చాంతం శమిత విషయం శుద్ధబుద్ధి విశాలం
వేదవ్యాసం విమల మతిదం సర్వదా హం నమామి

పరాశరుని కుమారుడు, పరమపురుషుడు, ఙ్ఞానులచే స్తుతింపబడువాడు, వేదవేదాంత వేద్యుడు, మంచి బుద్ధిని ప్రసాదించు వేదవ్యాసునికి సదా నమస్కరిస్తున్నాను.

వ్యాస భగవానుని జననం :
వ్యాస మహర్షి, సత్యవతీ గర్భాన జన్మించిన వృత్తాంతాన్ని దేవీ భాగవతం పేర్కొన్నది.
యమునాద్వీపంలో సత్యవతి సద్యోగర్భంలో అపర మన్మధుని వలె ఉన్న మహాతేజస్సంపన్నుడైన వ్యాసమహర్షి జన్మించాడు. ఆ ద్వీపంలోనే జన్మించి ఆ ద్వీపంలోనే ఉంచబడిన బాలుడు కాబట్టి అతనికి "ద్వైపాయనుడు" అని పేరు వచ్చింది. ఆయన పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి, తపస్సు చేయడానికి ఆమె అనుమతిని పొంది నిష్క్రమించాడు.

వ్యాసశ్రమం :
వ్యాసాశ్రమం బదిరికి వెళ్ళే త్రోవలో అలకానందా సరస్వతీ నదుల సంగమస్థానంలోని "శమ్యాప్రాస" తీర్ధానికి సమీపంలో ఉంది. వ్యాసుడు వేద ప్రచారం ఇక్కడనుండే ప్రారంభించాడని, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలైన మహర్షులు ఇక్కడే వేదశాస్త్రాలలో శిక్షణ పొందారని పురాణాలు చెబుతున్నాయి. కాని, వరాహ పురాణం ప్రకారం వ్యాసుడు, మధుర వద్దనున్న సోమతీర్ధం, వైకుంఠ తీర్ధముల మధ్యనున్న విష్ణు గంగాతీరంలో తపస్సు చేసినట్లు వివరణ.

వ్యాసుడు జగత్కళ్యాణం కోసం ఒకే రాశిగా ఉన్న వేదాలను విభజించి వాటి శాఖలను విడివిడిగా నిర్దేశించాడని భట్టభాస్కరుడు, తైత్తిరీయ సంహితలో స్పష్టం చేశాడు. అలాగే దుర్గాచార్యుడు, వేదరాశి ఒకటిగా ఉండి, అధ్యయన చేయడం కష్టంగా ఉండేదనీ, దానిని నాలుగుగా విభజించి, సులభతరం చేసారని పేర్కొన్నారు.

ఇప్పుదు జరుగుచున్నది, వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరంలో ఇది 28వ కలియుగం. ముందు గడిచిన 27 మహాయుగాలలో అనేక పేర్లుగల "వ్యాసులు" ఆవిర్భవించి, 27సార్లు వేదవిభజన చేశారు.కృష్ణద్వైపాయనుడు చేసిన వేదవిభజన 28వది. దీని బట్టి, ఇంద్రుడు మొదలైన పదవుల పేర్లు ఉన్నట్లే, "వ్యాస" అనేది కూడ ఒక పదవికి సంబందించినది అని. దానిని అధిష్టించు వ్యాసులు అనేకమంది ఉంటారని తెలుస్తొంది.

గతంలోని వ్యాసుల పేర్లు విష్ణుపురాణం ప్రకారం, 1) స్వయంభువు 2) ప్రజాపతి 3) ఉశనుడు (శుక్రాచార్యులు) 4) బృహస్పతి 5) సూర్యుడు 6) యముడు 7) ఇంద్రుడు 8) వసిష్టుడు 9) సారస్వతుడు 10) త్రిధాముడు 11) త్రివృషుడు 12) భరద్వాజుడు 13) అంతరిక్షుడు 14) ధర్ముడు 15) త్రయారుణి 16) ధనుంజయుడు 17) కృతంజయుడు 18) సంజయుడు 19) అత్రి 20) గౌతముడు 21) హార్యాత్మకుడు 22) వేణుడు 23) సోముడు 24) తృణబిందుడు 25) భార్గవుడు 26) శక్తి మహర్షి 27) జాతుకర్ణుడు 28) కృష్ణద్వైపాయనుడు

ఈ విధముగా ప్రతి ద్వాపరయుగంలోను ఒక మహనీయుడు వ్యాసపీఠాన్నలంకరిస్తాడు. వ్యాసభగవానుడు వేదమూర్తి, హిమాలయా శిఖరాలే ఆయన సముత్తుంగ శిరస్సు. కన్యాకుమారి ఆయన పాదద్వంద్వం. శ్రీలంక పాదపీఠం. యుగయుగాల వేదఘోషలోని ప్రణవనాదమే ఆయన హృదయ స్పందన. గంగాది సర్వనదీనదాలే రక్తనాళాలు. భారతీయ సంస్కృతే ప్రవహించే రక్తం. ఆయన నేర్పిన నడవడే ధర్మం. ఆయన అడుగుజాడలే భారతదేశాన్ని ప్రపంచదేశాలకు గురువుగా నిలిపాయి. ఆయనే వేదవ్యాసులు.

ఈ ప్రపంచ వాఙ్మయంలో ప్రతిదీ లోతుగా పరిశోధిస్తే చివరకి వాటి మూలంలో వ్యాసమహర్షే కనిపిస్తారు. అందుకే "వ్యాసోచ్చిష్టం జగత్సర్వం" అన్నారు. వేదవిఙ్ఞాన సర్వఙ్ఞ పీఠాధిపతి. అందుకే ఆయన జన్మదినమైన ఆషాఢ పూర్ణిమను భారతదేశమంతా వ్యాపూర్ణిమగా/గురుపూర్ణిమగ జరుపుకుంటాము. మహాయోగి అరవిందులు, వ్యాసుడిని జాతీయ కవిగాను, భారతాన్ని జాతీయ కవ్యంగాను అభివర్ణించారు.

వ్యాసుడు తన నలుగురి శిష్యుల ద్వార 4వేదాలను, సూతమహర్షి ద్వారా సకల పురాణ సంపదను, వైశంపాయనుని ద్వార మహాభారతాన్ని, శుకయోగి ద్వార భాగవతాన్ని మానవజాతికి అందించారు.
You are subscribed to email updates from Gurukrupa
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610



--

Love all - Serve all


"Amma" Srinivas

9177999263

www.aswa.tk

www.sri4u.tk

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.


దీపావళి



Gurukrupa


దీపావళి

Posted: 22 Oct 2011 01:00 PM PDT

సంస్కృతం లో "వళి" అంటే వరుస, దీపావళి అంటే దీపాల వరుస.ఆశ్వీయుజ మాసం చివరి ఐదు రోజులు దీపావళి
పండగను జరుపుకుంటాము. దసర పండగ నుండి 20 రోజుల తర్వాత దీపావళి వస్తుంది. స్కందపురాణం లో చెప్పినట్లు, "శుక్లపక్షం లో అష్టమి తిది నుండి 12 రోజుల వరకు (దీపావళి దాక) "మహా శక్తి వ్రతం" చేస్తారు, దీనినే కేధారవ్రతం అంటాము.ఈ రోజున మహాశివుడు "శక్తి"ని (అమ్మవారిని) తన శరీరంలో అర్ధబాగం గా స్వీకరిస్తాడు. ఈ రూపమే "అర్ధనారీశ్వర రూపం". కలశంని 21 పోగులు గల దారం తో అలంకరించి, 21 నైవేద్యంల తో అమ్మవారిని 35 రోజులు పుజిస్తారు. (35 వ రోజు ) చివరిరోజు చేసే వ్రతాన్ని "కేధార గౌరీ వ్రతం" అంటారు. దీపావళి రోజు లక్ష్మి పూజను చేస్తాము.

దీపావళి ఎన్నెన్నో రకాలుగా, మరెన్నో విధాలుగా కూడా తరతరాలుగా ఆచరణలో కనిపిస్తుంది. ఆంధ్రదేశంలోను, దక్షిణభారతదేశం అంతటా ఈ పండుగను మూడు రోజులు జరుపుకోవటం కనిపిస్తుంది. ఆశ్వయుజ బహుళ చతుర్థశి, అమావాస్య, కార్తీకశుద్ధ పాఢ్యమి ఈ మూడునాళ్ళు ఎంతో పుణ్యప్రదంగా భావించుకుంటూ ఒక వ్రతవిధిని అవలంబిస్తూ ఆచరించటం కనిపిస్తుంది. ఉత్తరాన ఈ పండుగనే ఐదురోజులపాటు జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, చతుర్థశి, అమావాస్య, కార్తీకశుద్ధ పాఢ్యమి, విదియ. ఈ ఐదురోజులు అక్కడ ఎంతో పర్వదినాలుగా భావిస్తారు. ధనత్రయోదశి (ధన్‌తేరస్‌ లేదా యమత్రయోదశి) నరక చతుర్థశి, దీపావళి, బలిపాఢ్యమి, భగినీహస్తభోజనం (భ్రాతృద్వితీయ) లేదా యమద్వితీయగా ఐదురోజులపాటు పండుగను చేసుకుంటారు.

వ్రత గ్రంథాలను పరిశీలిస్తే ఈ పండుగ జరుపుకునే తీరు తెలుస్తుంది. త్రయోదశినాటి రాత్రి అపమృత్యు నివారణకోసం నూనెతో దీపాన్ని వెలిగించి దాన్ని పూజించి ఇంటికి ఎదుట, వెలుపల భాగంలో ఉంచుతారు. దీన్నే యమద్వీపం అని కూడా అంటారు. ఆ మరునాడు నరక చతుర్థశిని జరుపుకుంటారు. లోకకంఠకుడైన నరకాసురుడు భగవానుడు చేతిలో హతమై లోకకల్యాణం జరిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఈ పండుగ ఆనాటి నుంచి అలా ప్రజలంతా జరుపుకుంటున్నారు.

నరకచతుర్థశినాడు నూనెలో లక్ష్మి, నీటిలో గంగ ఉంటాయి కనుక నువ్వుల నూనెతో తలంటుకొని విధి విధానంగా సూర్యోదయానికి ముందే తలంటుస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి ఉత్తరేణు ఆకులు, మట్టిపెళ్ళలతో దిష్టితీయించుకొనే సంప్రదాయం ఒకటుంది. మినప ఆకులను తినటంకూడా అంటే వండించుకొని తినటంకూడ ఓ సంప్రదాయంగా ఉంది. ఆ మరునాడు దీపావళి అమావాస్య రోజున మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల బెరడులను నీటిలోవేసి ఆ నీటితో స్నానంచేయటం ఓ ఆచారం. ప్రదోషకాలల్లో దీపాలను వెలిగించి అనంతరం దారిద్య్రాన్ని పారదోలేందుకు, ఇంట ధనరాసులు నిండేందుకు లక్ష్మీపూజను చేస్తుంటారు. దీపాలను వెలిగించటం, బాణాసంచా కాల్చటం, ఆకాశ దీపాలంటివి అమర్చటం, పితృదేవతారాధన లాంటివి ఈ పండుగనాడు చేస్తుంటారు.

దీపావళి రాత్రి నిద్రపోకుండా జాగరణ చేసి, అర్థరాత్రి వేళ, దరిద్ర దేవతను ఇళ్ళనుంచి, ఊరినుంచి కొంతమంది తరిమేస్తుంటారు. స్త్రీలు చాటలు, తప్పెటలు వాయిస్తూ దరిద్రాన్ని తరమటం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటి ఆవరణలో చక్కగా శుభ్రంచేసి ముగ్గులు తీర్చిదిద్దుతారు. దీపావళి మరునాడు బలిపాఢ్యమిని జరుపుతారు. బలిచక్రవర్తిని వామనవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు పాతాళానికి పంపేటప్పుడు ఆయనను మళ్ళీ సంవత్సరానికి ఒకసారి భూమిమీదకు వచ్చి ఒక్కరోజు పాలించేలా వరమిచ్చిన సన్నివేశాన్ని ఈరోజున జరుపుకుంటారు. ఆ మరునాడు భ్రాతృద్వితీయ. ఈ రోజున సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతివంటను ఆరగించి వస్తారు. ఈ ప్రకారం దీపావళి దేశవ్యాప్తంగా ఆనంద ఉత్సాహాల నడుమ జరుగుతుంటుంది.

You are subscribed to email updates from Gurukrupa
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610



--

Love all - Serve all


"Amma" Srinivas

9177999263

www.aswa.tk

www.sri4u.tk

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.


15, అక్టోబర్ 2011, శనివారం

FW: Railway ticket reservation start dates for Sankranthi


From: Vivek Akula
Sent: Saturday, October 15, 2011 12:21 AM
Subject: FW: Railway ticket reservation start dates for Sankranthi

 

 

 

 

Hi

 

Festival Dates are 14th Boghi(Saturday), 15th Sankranthi(Sunday) , 16th (Monday) Kanuma.

 

As per the Railway rules Reservation will be start before 90 days of the Journey commencing date.

 

2012 SANKRANTHI reservation will be started on this October only.

 

Below are the details of the Railway Reservation starting dates for the SANKRANTHI 2012:

 

 

 

Jouney Date

Weekday

Reservation booking start date

10-Jan-12

Tuesday

12-Oct-11

11-Jan-12

Wednesday

13-Oct-11

12-Jan-12

Thursday

14-Oct-11

13-Jan-12

Friday

15-Oct-11

14-Jan-12

Saturday

16-Oct-11

15-Jan-12

Sunday

17-Oct-11

16-Jan-12

Monday

18-Oct-11

17-Jan-12

Tuesday

19-Oct-11

18-Jan-12

Wednesday

20-Oct-11

19-Jan-12

Thursday

21-Oct-11

20-Jan-12

Friday

22-Oct-11

 

 

 

Thanks,