1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

13, డిసెంబర్ 2009, ఆదివారం

మహనీయుల గురించి...



బాలలూ మన భారతదేశంలో ఋషులు, ప్రవక్తలూ, మహాత్ములూ, మేధావులూ, శాంతిదూ తలూ, వీరులూ, త్యాగులూ, ధాన ధర్మాత్ములూ... ఇలా ఎందరో మహాను భావులు పుట్టారు. ఆ మహనీయుల చరిత్రను స్మరించు కుంటూ మన జీవితాలని బాల్యం నుంచే సరిదిద్దుకుంటూ, దేశభక్తితో జీవించడానికి ప్రయత్నించాలి.

గాంధీజీ
జాతిపిత మహాత్మా గాంధీజీని గురించి ఎంత తెలుసు కున్నా తక్కువే అవుతుంది. నిరంతరం ఆ మహాత్ముని స్మరిం చుకుంటూ ఆయన ఆశయాలని బాలలైన మీరు ఇప్పట్నుంచే అలవర్చుకోవాలి, ఆచరించాలి.
వెూహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీకి తల్లిదండ్రులంటే ఎంతో భక్తీ, గౌరవాలుండేవి. తల్లి అంటే గాంధీకి అమిత మైన ప్రేమ! అతడామె ఆజ్ఞలన్నిటినీ కూడా మూఢంగా అను సరించేవాడు. బాల్యం నుంచే గాంధీజీ తాను మంచిదని నమ్మిన సిద్ధాంతాన్ని తల్లి చెప్పినా కూడా ఏ మాత్రం వినే వాడు కాడు. ఒకసారి తన అన్న గాంధీని కొట్టి అవమాన పర్చాడని తల్లితో వెళ్లి ఫిర్యాదు చేశాడు. తల్లి పుత్లీభాయికి కోపం వచ్చింది. ''వెంటనే అన్నయ్యను మళ్లీ తిరిగి కొట్టలేకపోయావా!'' అని తల్లి ప్రశ్నించింది. వెూహన్‌గాంధీకి ఆశ్చర్యం వేసి తల్లివంక చూస్తూ ''అమ్మా! నీవు నన్ను తిరిగి అన్నయ్యను కొట్టమని బోధిస్తున్నావేమిటి నేనెవరినైనా ఎందుకు కొట్టాలి... కొట్టినవాడ్ని అలా కొట్టకూడ దని పిలిచి చెప్పడానికి బదులు దెబ్బలు తిన్న నన్ను తిరిగి అన్నయ్యను కొట్టమని చెబుతావేమిటమ్మా!'' అని ప్రశ్నించాడు బాల గాంధీ. అపðడు అతని విజ్ఞతకు తల్లి ఎంతో మెచ్చుకుంది. చిన్నతనంలోనే అం తటి తెలివితేటలు గల వాదన అలవడినం దుకు ఆశ్చర్యంతో పాటు సంతోషపడ్డది.
చూశారా బాలలూ! ఏ మంచి కార్య క్రమాలైనా చిన్నప్పట్నుంచే అలవర్చు కోవాలి. ఏది మంచి, ఏది చెడు అని గ్రహించి ఎపðడూ మంచిగానే గ్రహిం చాలి. అదే మీ జీవితాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు పయనింపచేస్తుంది.

లోహియా
దేశభక్తుడు, సృజనాత్మక ప్రతిభగల రామ్‌ మనోహర లోహియా జీవితంలోని ఓ చిన్న సంఘటన గురించి ముచ్చటించుకుందాం.

1930లో నానారాజ్య సమితి జరుగుతోంది. ఉన్నట్టుండి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఒక పెద్ద 'ఈల' వినిపించింది. అంతా చకితులై చూశారు ఈల వేసి వ్యక్తి వైపు. భారతీయ ప్రతినిధిగా వచ్చిన అప్పటి బికనీర్‌ మహారాజా తాను ప్రసంగిస్తున్న భాషను నిలిపి ప్రేక్షకుల గ్యాలరీ వైపు ఈల వేసిన ఆ వ్యక్తి వైపే తెల్లబోయి చూస్తూండిపోయాడు. భారతదేశంలోని బ్రిటీష్‌ పాలనా శ్రేష్ఠత్వాన్ని గురించి ఏకధాటిగా ఉపన్యసిస్తున్నాడు బికనీర్‌ మహారాజా ఆనాటి నానారాజ్య సమితిలో. అపðడు ఆ అబద్ధాల పొగడ్తల ప్రసంగాన్ని వినలేక అసమ్మతిగా 'ఈల' వేశాడు రామ్‌ మనోహర లోహియా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి.

వెంటనే అక్కడున్న కొందరు లోహియాను బలవంతం గా బయటకు పంపివేశారు. అపðడు లోహియా వయస్సు 20 సంవత్సరాలు మాత్రమే. అపðడు ఆయన 'బెర్లిన్‌ విశ్వ విద్యాలయం'లో అధ్యయనం చేస్తూండేవాడు. భారతదేశం లో బ్రిటీష్‌ పాలనా విధానాలను గురించి బికనీర్‌ మహారాజా చేయబోయే ప్రసంగాన్ని వినాలనే కుతూహలం కొద్దీ లోహియా బెర్లిన్‌ నుంచి జెనీవా వచ్చాడు. ఆ ప్రసంగం ఏ మాత్రం నచ్చని లోహియా ధైర్యంగా వ్యతిరేకిస్తూ ఈల వేయ టం సామాన్యమైన విషయం కాదు. చూశారా బాలలూ! ఆయన నరనరాలలో 'దేశభక్తి' ఎలా పొంగి పొర్లిందో! అలాంటి దేశభక్తి మీలో పెం పొందించు కోవాలి.

శరత్‌బాబు
గొప్ప బెంగాలీ రచయిత శరత్‌ బాబును గురించి తెలియని సాహిత్య పరుడు ఉండడు. ఆయన నవలలు, కథలు యథార్థ జీవితాలకు అద్దం పడు తాయి. బాల్యం నుంచి కూడా శరత్‌ చాలా కష్టనష్టాల్నీ బాధల్నీ అనుభవించిన గొప్ప రచయిత. ఆయన విశిష్ట వ్యక్తి త్వాన్ని ఎత్తిచూపే ఈ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుందాం బాలలూ!
'దేశబంధు' చిత్తరంజన్‌దాసుని తెలి యనివారుండరు. రాజకీయనాయకుడిగా, లాయర్‌గా, కవిగా ప్రసిద్ధుడు ఆయన.
అప్పట్లో 'నారాయణ' అనే ఒక సాహిత్య పత్రికాధిపతిగా ఉండేవారు ఆయన. చిత్తరంజన్‌ కోరిక ప్రకారం శరత్‌బాబు 'స్వామి' అనే ఒక కథను రాసి పంపిం చాడు. ఆ కథను చదివిన దాసు తన్మయుడై తిరుగు టపాలో ఓ బ్లాంక చెక్కుని శరత్‌బాబుకి పంపాడు. దాంతోపాటు ఆయన ఓ ఉత్తరాన్ని కూడా జత చేశాడు. అందులో ''మహౌ న్నతమైన ఒక రచయిత నుంచి ఓ గొప్ప కథను సంపా దించాను. దానికి ఇంత అని వెలకట్టే సాహసం నాకు లేదు. అందుచేత ఈ ఖాళీ చెక్కును మీకు పంపాను. ఈ కథకు మీ ఇష్టం వచ్చినంత మొత్తాన్ని ప్రతిఫలంగా వేసొకొని మార్చుకొనవచ్చును'' అని వివరంగా రాశాడు.

శరత్‌బాబు ఆ ఉత్తరాన్ని, చెక్కును చూసి సంతోష పడ్డాడు. ఆ బ్లాంక చెక్కులో కేవలం మూడు రూపాయలే వేసుకొని మార్చుకున్నాడట!

చూశారా బాలలూ! శరత్‌బాబు ప్రతిష్ట, ఆయన నిజా యితీ తత్త్వం. వ్యక్తిత్వ వికాసం జీవితాన్ని ఆనందమయంగా మారుస్తుంది. ఉన్నతమైన సద్గుణాలు బాల్యం నుంచే పెంపొం దించుకోవాలంటే మహనీయుల జీవిత చరిత్రల్ని చదవాలి, ఆచరిస్తూ రావాలి. నేటి విజ్ఞానవంతులైన బాలలే ఉజ్వల భావి పౌరులుగా రాణిస్తారు

కామెంట్‌లు లేవు: