1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

21, జులై 2009, మంగళవారం

ఎవరిని ధ్యానించాలి

ఎవరిని ధ్యానించాలి?

- ఆచార్య మసన చెన్నప్ప

కర్మ చేయడంలో మనం స్వతంత్రులం. కాని, కర్మఫలాన్ని అనుభవించడంలో అస్వతంత్రులం. దీన్నిబట్టి కర్మఫలాలు ఇచ్చేవాడు ఒకడున్నాడని తెలుస్తుంది. అతనికే పరమాత్మ అని పేరు.

ఎవరు ఈ మానవజన్మతో పాటు, సమస్త శక్తుల్ని మనకు ప్రసాదిస్తున్నారో, ఎవరిని ఈ విశ్వమంతా ఎల్లవేళల ఉపాసిస్తుందో, ఎవరి ఆజ్ఞను సమస్త దేవతలు శిరసా వహిస్తున్నారో, ఎవరిని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుందో, ఎవరిని ఆశ్రయించకపోతే మళ్లీమళ్లీ జన్మలెత్తవలసి వస్తుందో- అట్టి
దేవుణ్నే మొక్కాలని వేదం చెబుతుంది.

అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని; చీకటిని విడిచిపెట్టి ప్రకాశాన్ని; మృత్యువును విడిచిపెట్టి అమృతాన్ని చేరుకోవాలని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి.

'సత్‌', 'జ్యోతి', 'అమృత' శబ్దాలు పరమాత్మకే వర్తిస్తాయి. ప్రపంచం అసత్తు. అనగా సత్యం కానిది. పరమాత్మ సత్యం. కనుక అతడు సత్యస్వరూపుడు. అజ్ఞానమే చీకటి. పరమాత్మ పూర్ణజ్ఞానం కలిగినవాడు. అతని జ్ఞానమనే వెలుగులో మన అజ్ఞానమనే చీకటి పటాపంచలమవుతుంది. కనుక పరమాత్మ 'చిత్‌' స్వరూపుడు. మనం మర్త్యులం. అనగా మృత్యు ముఖంలో ఉన్నవారం. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇలాంటి మృత్యువు నుంచి మనం బయటపడాలి. కనుక అమృతసిద్ధి పొందాలి. అమృతం అంటే శాశ్వతానందం. అది పరమాత్మలోనే ఉంది. కనుకనే ఆయన ఆనందస్వరూపుడు. అందుకే మనం ఎల్లవేళలా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మనే ధ్యానించాలి.

కనిపించే ఈ స్థూల ప్రపంచానికి మూలకారణమైన
ప్రకృతి కూడా సత్‌ పదార్థమేకాని, అది జ్ఞానరహితమైనది. అనగా దానికి తెలివిలేదు. కనుక పరమాత్మకు బదులుగా ఈ జడ ప్రకృతిని ఎవరు ధ్యానిస్తారో వారు దుఃఖరూపమైన అంధకారంలో పడిపోతారని వేదం చెబుతుంది.

సర్వజ్ఞుడైన పరమాత్మ జడప్రకృతి కంటే భిన్నమైనవాడు.
ప్రకృతి కారణంగా కలిగిన విశ్వానికి ఆకారం ఉంది. కాని అతనికి లేదు.

పరమాత్మ సర్వాంతర్యామి కనుక అతనిని పిలువలేం. సర్వాధారుడు కనుక అతనికెలాంటి ఆసనం ఇవ్వజాలం. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాడు కనుక అర్ఘ్య పాద్యాదులు సమర్పించలేమని శంకర భగవత్పాదులు 'పరాపూజా' అనే గ్రంథంలో శ్లోక రూపేణా రాశారు.

జడానికి బదులు జ్ఞానాన్ని ఆశ్రయించడం వల్లనే ముక్తి లభిస్తుందని సాంఖ్య దర్శనం చెబుతుంది.

ఈ దర్శనంలోనే ధ్యానమంటే ఏమిటో స్పష్టంగా ఉంది.

విషయరహితమైన మనస్సుకే ధ్యానం అని పేరు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే అయిదూ విషయాలు. వీటి నుంచి మనస్సు పూర్తిగా వైదొలగినప్పుడే ధ్యానానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆత్మ మనస్సు నుంచి కూడా విడివడి పరమాత్మ ధ్యానంలో మునిగిపోవాలి.

మనం ఎవరిని లక్ష్యంగా చేసుకొని ధ్యానిస్తున్నామో, ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే ప్రవాహరూపంలో ఉండాలి.
పరమాత్మ సర్వ వ్యాపకుడైనప్పటికీ కేవలం మన హృదయంలో ఉన్న ఆత్మలోనే ఆయన దర్శనమివ్వగలడు. దీన్నే ఈశ్వర సాక్షాత్కారమని మన పెద్దలు చెప్పినారు. పరమాత్మ జడపదార్థం కాడు కనుక కనిపించడు. కాని, మన అనుభవంలోకి వస్తాడు. ఇదే ఈశ్వర సాక్షాత్కారం. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకు మనం చేయవలసిందల్లా ఆత్మకు పాపపంకిలాన్ని అంటకుండా జాగ్రత్తపడటమే.

నీటిమీద చెత్తాచెదారం ఉంటే చంద్రుణ్ని ఎలా చూడలేమో, అలాగే
ఆత్మకు పాపం అంటుకుంటే పరమాత్మను కూడా అనుభవంలోకి తెచ్చుకోలేం.
(ఈనాడు, అంతర్యామి, ౨౦:౦౭:౨౦౦౯)

పేగుబంధం



వత్సం అంటే ఆవుదూడ. అది పుట్టినప్పుడు దాని ఒంటినిండా మావి అలముకుని జుగుప్సావహంగా ఉంటుంది. అప్పుడు వత్సల(గోమాత) బిడ్డ దేహంమీద మకిలి అంతటినీ స్వయంగా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ప్రేమగా, ఆత్మీయంగా, శ్రద్ధగా తల్లిగోవు ఆ పని చేస్తున్నప్పుడు వ్యక్తమయ్యే గొప్ప భావాన్నే వాత్సల్యం అంటారు. వాత్సల్యం తల్లుల సొత్తు. మాతృత్వం అనేది సృష్టిలోని ఒకానొక మహత్వపూర్ణమైన అనుభూతి. అది బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ! తల్లి అనిపించుకోవడానికి స్త్రీ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. అమితమైన బాధను ఓర్చుకుంటుంది. ప్రసవ వేదన ఎంతటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది. రైలు పట్టాలమీద పెట్టిన నాణెం చక్రాలకింద నలిగి వెడల్పవుతుంది చూశారా! కాన్పులో బాధను దానితో పోల్చి చెప్పిందొక కవయిత్రి. దుర్భరమైన నొప్పులను ఓర్చుకున్న అమ్మ నలుసును చూడగానే సంతోషంగా నవ్వుతుంది. అమ్మనొప్పులకు కారణమైన ఆ బిడ్డ మాత్రం ఏడుస్తాడు. అదే సృష్టిలోని చిత్రం! కన్నాక కూడా కొన్నాళ్ళపాటు తన నోటిని కట్టేసుకుని తల్లి పథ్యంచేస్తూ బిడ్డకు మాత్రం తియ్యని పాలిచ్చి పెంచుతుంది. సంతానాన్ని పెంచి పెద్దచేసే క్రమంలో ముఖ్యభూమిక వహిస్తుంది. తల్లి పెంపకంలో గొప్పగొప్ప యోధులైనవారు చరిత్రలో మనకు చాలామంది కనిపిస్తారు. పురాణ కాలంలో పాండవులు మొదలు, ఆధునిక యుగంలో శివాజీ దాకా మహాయోధులైన వారెందరిపైనో తల్లి ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. దాన్ని గుర్తించాడు కాబట్టే 'ప్రపంచంలో గొప్పవారంతా తమ తల్లుల లక్షణాలను అధికంగా పుణికిపుచ్చుకున్నవారే' అని నిర్ధారించాడొక తత్వవేత్త. 'ఒడిలో కూర్చొనియుండ, నీవు మమతాయోగమ్ము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునపుడేమో గాఢసంరక్షలో గుడిలో దీపము వోలెనుంటి...' అన్న ఒక మహాసహస్రావధాని మాట- అమ్మ ఒడిలోని భద్రస్థితికి కవితాకర్పూర నీరాజనం.

అమ్మ జన్మదాత అనుకుంటే- నాన్న జీవదాత! దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. పురుషేహవా... అనే ఐతరేయమంత్రం- తండ్రి శుక్రం ద్వారా తల్లి గర్భంలో దేహాన్ని పొందడం జీవుడికి మొదటి జన్మగా చెప్పింది. శిశువు రూపంలో భూమిమీద పడటం రెండో జన్మ. అక్కడినుంచి తండ్రి సంరక్షణ మొదలవుతుంది. తల్లీతండ్రీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అపురూపంగా పెంచుకుంటారు. వాళ్ళకోసం అవసరమైతే, తాము పస్తులుండటానికి సిద్ధపడతారు. తమ పిల్లలు తమకన్నా అన్నివిధాలా పెద్దస్థాయిలో జీవించాలని కోరుకుంటారు. తపనపడతారు. త్యాగాలు చేస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెద్దవాళ్ళను చెయ్యడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇష్టంగా నిర్వహిస్తారు. ఊహ తెలియగానే పిల్లవాణ్ని 'నీ బతుకు నువ్వు చూసుకో' అనడానికి భారతీయ తల్లిదండ్రులకు మనసొప్పదు. 'భార్య భర్త అనే రెండు తాళ్ళు ముడివేస్తే- ఆ ముడి సంతానం' అన్నాడు భర్తృహరి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ పేగుముడే- మనిషి అసలైన జీవ లక్షణం. చమురు ఆవిరైతే దీపం ఏమవుతుంది? బంధం శిథిలమైతే బతుకులో ఇక ఏముంటుంది? భార్యాభర్తలు విడిపోవచ్చు, చెడిపోవచ్చు గాని- తల్లిదండ్రులుగా మారాక బాధ్యతగా జీవించవలసిందేనని మన పెద్దల తీర్మానం. భార్యాభర్తల మధ్య ముందు ఏర్పడ్డ దూరం పిల్లలనే ముడితో తరిగిపోతుందంటారు వేటూరి ప్రభాకరశాస్త్రి. 'సంతానం కలగడంతో ఎన్నో సమస్యలు సమసిపోయి భార్యాభర్తలు దగ్గరకావడం మనం చూస్తున్నాం. అలాగే ప్రేమపెళ్ళిళ్లను ఆమోదించలేక విడిపోయిన కుటుంబాలు సైతం కొత్త జంటకు పిల్లలు కలిగేసరికి తిరిగి కలగలసిపోవడం మనం ఎరుగుదుం. అదే 'సుతాకారపు ముడి' అంటే! దాని ప్రభావం తియ్యనిదేకాదు, బలమైనది కూడా!

అనుబంధాలూ ఆత్మీయతలూ లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని సాదరంగా, ఆత్మీయంగా చూసుకోవాలి. ఆ సంప్రదాయ పరంపర తరవాతి తరానికి ఆదర్శం కావాలి. గడపడానికీ, జీవించడానికీ మధ్య తేడా అదే! తన తల్లిదండ్రుల పాదపద్మాలను ప్రీతిగా 'ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్నను విమల తరము...' అని స్తుతించాడు పాండురంగడు. స్వతహాగా చదువూసంధ్యా అబ్బకపోయినా- కౌశికుడంతటివానికి జ్ఞానబోధ చేయగలిగే స్థాయి వివేకం తనకు దక్కడానికి కారణం తల్లిదండ్రులకు చేసిన సేవలే అన్నాడు- భారతంలో ధర్మవ్యాధుడు. ఆడపిల్లలు తండ్రిమీద, మగపిల్లలు తల్లిపైన ప్రేమ అధికంగా కలిగిఉంటారని చెబుతారు. మనమూ పిల్లల్ని 'నువ్వు అమ్మ పార్టీయా, నాన్న పార్టీయా' అని ఆరా తీస్తుంటాం. 'వాడు అమ్మ కూచి... ఆమె నాన్న కూచి' అంటూ ముద్రలు వేస్తుంటాం. ఏ రకంగా ముద్రలు వేసినా, ఎటువైపు మొగ్గుచూపినా పిల్లలందరూ తమ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటారు. అమ్మానాన్నా ఒకరినొకరు మనసారా ప్రేమించడం, గౌరవించడమే పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇటీవల హైకోర్టు ధర్మాసనం సైతం ఇదే విషయాన్ని ఒక జంటకు వివరించింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కాపురంలో కలతలు మొదలై ఆ జంట విడిపోయింది. పిల్లలిద్దరూ చెరో చోటా ఉండిపోయారు. అయిదేళ్ళు గడిచాక విడాకుల కేసు కోర్టుకు వచ్చినప్పుడు చిన్నపాపను న్యాయమూర్తి పిలిచి 'నీకు అమ్మానాన్నల్లో ఎవరు కావాలి?' అని అడిగారు. ఆ పిల్ల చేతులు జోడించి 'నాకు అమ్మ, నాన్న, అక్క ముగ్గురూ కావాలి' అని దీనంగా అడిగింది. దాంతో న్యాయమూర్తి చలించిపోయారు. జనం కరిగిపోయారు. తల్లీతండ్రీ కన్నీటితో సతమతమయ్యారు. కరుణ రసాత్మకమైన ఆ ఘటనతో వారిద్దరూ పశ్చాత్తాపానికి లోనయ్యారు. తిరిగి ఒకటవుతామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. పేగుబంధం తన ప్రభావాన్ని చూపించింది. ఆ కుటుంబం ఆనందాశ్రువులతో ఒక్కటైంది. సమాజంలో వస్తున్న గొప్ప మార్పునకు సంకేతంగా నిలిచింది.

కోరికల్ని ఎలా జయించాలి? తృప్తిపరిచా ? లేక అణచివేశా

కోరికల్ని ఎలా జయించాలి? తృప్తిపరిచా ? లేక అణచివేశా ?

ఒకసారి కొన్ని ప్రశ్నలు రాసి వున్న కాగితాన్ని ఒకతను భగవాన్ కు అందించారు.

ప్రశ్న: ఎవరయినా చెప్పినదాన్ని వెంటనే నమ్మే అలవాటును ఎలా వదుల్చుకోవాలి? ఒకరు ఒక ఆదర్శాన్ని చెపితే తక్షణమే నమ్మేసి ఆచరిస్తూ, ఇంకెవరన్నా వచ్చి వేరే ఆదర్శాలను గురించి పొగిడితే వాటిని నమ్మి పాతవి వదిలి వేయడానికి తయారవుతానే!

భగవాన్ : అవునవును. మనకున్న బాధే ఇది. సత్యాన్ని తప్ప మిగతా అన్నిటినీ నమ్మేస్తాం. మనకున్న తప్పు నమ్మకాలను వదిలివేయాలి. ఇది మాత్రమే మనం చేయాల్సింది. అపుడు సత్యం స్వయంగా ప్రకాశిస్తుంది.

ప్రశ్న: ఎంతో ఉత్సాహంగా ఏదో ఒక ఆదర్శం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను. కానీ రాను రాను ఆ ఉత్సాహం కాస్తా తగ్గి పట్టుదల సడలిపోతుంది. అలా జరగడానికి కారణమేమి? అలా కాకుండా ఉండడానికి నేనేమి చేయాలి?

భగవాన్: ఆరంభంలో నీ ఉత్సాహానికి కారణం ఒకటి ఉన్నపుడు తరువాత నీ నిరుత్సాహానికి కూడా ఒక కారణం ఉండాలి కదా!

ప్రశ్న: ఎందరో గురువులు ఎన్నెన్నో మార్గాలు ఉపదేశిస్తారు. అందులో ఎవర్ని గురువుగా ఎన్నుకోవాలి?

భగవాన్: శాంతి ఎవ్వరి దగ్గర లభిస్తుందో అతనినే.

ప్రశ్న: కోరికలను వదల్చుకోవడానికి వాటితో ఏ విధంగా వ్యవహరించాలి? వాటిని తృప్తిపరిచా? లేక అణచివేశా?

భగవాన్ : తృప్తి పరచితే కోరిక నశించేటట్లయితే తృప్తిపడటంలో నష్టంలేదు. కానీ సామాన్యంగా కోరికలేవీ ఆ రకంగా నశించిపోవు. అలా చేయడం మంటలను ఆర్పడానికి పెట్రోలును మంటలమీద పోయడంలాంటిది. బలవంతంగా కోరికలను అణచడం సరియైన మార్గం కాదు. అణచిన కోరికలు అపుడు కాకపోయినా ఇంకొక్కప్పుడైనా విజృంభించి చెడు ఫలితాలకు కారణమవుతాయి.

కోరికలను వదల్చుకోవడనికి సరియైన మార్గం -
ఈ కోరిక లెవరికి? మూలమేమి ? అని తెలుసుకోవడమే.


అలా తెలుసుకున్న తరువాత ఆ కోరిక సమూలంగా నశించిపోతుంది. ఆ తరువాత అని మళ్ళీ తలెత్తడం, పెరగడం ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, తాగడం లాంటి చిన్న అవసరాలు తీర్చడంలో ఇబ్బందిలేదు. అవి నీ మనసులో వాసనలను నాటి ఇంకో జన్మకు కారణం కాదు. ఆ పనులన్నీ జీవితాన్ని గడపడానికి అవసరమౌతాయేగానీ వాసనలుగా మారే అవకాశం లేదు. తృప్తి పరచడం ద్వారా ఇంకా ఇంకా కోరికలు పెరిగి మనసులో కొత్త వాసనలను కల్పించనట్టి కోరికలను తృప్తిపరచడంలో నష్టంలేదు అని సామాన్యమైన సూత్రం

17, జులై 2009, శుక్రవారం

మూర్ఖోపాఖ్యానం



రామాయణంలో పిడకల వేటలాగా, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న తిక్కన భారతం మధ్యలో యీ మూర్ఖోపాఖ్యానం! నేనేం చెయ్యను, హఠాత్తుగా నాకీ పద్యాలు ఇవ్వేళ (మళ్ళీ) గుర్తుకొచ్చాయి మరి. గుర్తుకు రావడం వెనక ఒక కారణం ఉంది కాని, అదిక్కడ చెప్పడం సభ్యత కాదు, అవసరమూ లేదు. అసలీ పద్యాలు (వచ్చిన వాళ్ళకి), ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో భర్తృహరి రాసినా, ఆ తర్వాత ఎప్పుడో లక్ష్మణకవి తెలుగు చేసినా, వీటికి కాలదోషం పట్టకుండా (అదే expire అవ్వకుండా) ఉండడానికి మనవేఁ కారణం. మూర్ఖులున్నంత వరకూ ఇవి నిలిచే ఉంటాయి!

బోద్ధారో మత్సరగ్రస్తాః
ప్రభవః స్మయ దూషితా
అబోధోపహతాశ్చాన్యే
జీర్ణ మఙ్గే సుభాషితం

బోద్ధలగువారు మత్సరపూర్ణ మతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజు లబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు

తెలిసినవాళ్ళేమో అసూయాపరులు, ప్రభువులేమో గర్వాంధులు. ఇతరులకి విని బోధపరచుకొనే తెలివిలేదు. చెప్పాలనుకున్న సుభాషితం నాలోనే జీర్ణమైపోయింది.

మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా
యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్

మొసలి నోట్లో చిక్కిన మాణిక్యాన్నైనా బయటకు తియ్యవచ్చు, నిరంతరం చలించే పెద్ద పెద్ద అలలతోకూడిన మహా సముద్రాన్నైనా దాటవచ్చు, పామునైనా తలలో పూదండలాగా ధరించవచ్చు. మూర్ఖుడి మనసుని మాత్రం ఒప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు! (సంస్కృతంలో మొండిపట్టుపట్టిన మూర్షుడు అని ఉంటుంది)

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప లేము

ప్రయత్నిస్తే ఇసుకలోంచి చమురుని తియ్యడం సాధ్యమవచ్చేమో. ఎండమావి వెంటబడి అందులో నీరు తాగవచ్చునేమో. కొమ్మున్న కుందేలుని వెతికి పట్టుకోవచ్చేమో. ఇవేమీ చేసే అవకాశం లేదు కాని కనీసం చెయ్యవచ్చేమో అని ఆలోచించవచ్చు. కాని మూర్ఖుని మనసుని ఒప్పించే, మార్చే ప్రయత్నాన్ని మాత్రం ఊహలో కూడా చెయ్యలేము!

కరిరాజున్ బిసతంతుసంతతులచే గట్టన్ విజృంభించు వా
డురు వజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింప, దీ
పు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుం జింద యత్నించు, ని
ద్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్

మదపుటేనుగును తామరతూళ్ళతో కట్టడానికి ప్రయత్నించేవాడు, దిరిసెనపువ్వులతో వజ్రాన్ని కోయ్యాలనుకునేవాడు, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చాలని చూసేవాడు, మంచిమాటలతో మూర్ఖులకి చెప్పే ప్రయత్నం చేసేవాడు వీళ్ళందరూ ఒకలాంటి వాళ్ళేనట!


ఈ పద్యాలు చదివినప్పుడల్లా, భర్తృహరి ఎంతమంది ఎలాంటి మూర్ఖులని కలిసి వాళ్ళతో వాదించాల్సి వస్తే ఇంతలా యీ మూర్ఖపద్ధతిని వర్ణించేవాడూ అనిపిస్తుంది. ఆ బాధ ఏవిఁటో తెలుసుకాబట్టి, అతని మీద జాలికూడా కలుగుతుంది.

మూర్ఖులు చాలా రకాలుగా ఉంటారు. తాము మూర్ఖులమని తెలియని వాళ్ళు కొందరైతే, తెలిసిన వాళ్ళు మరికొందరు. వీళ్ళు తెలుసున్న మూర్ఖులన్న మాట! మళ్ళీ ఇందులో, కొంతమంది తమ మూర్ఖత్వానికి సిగ్గుపడి మౌనంగా ఉండలనుకొనేవారు కొందరైతే, తమ మూర్ఖత్వానికి తాము గర్వపడుతూ, దానికి రకరకాల పేర్లుపెట్టి విజృంభించేవారు మరికొందరు.
వీళ్ళందరూ కాక మూర్ఖులలో మరో రకం కూడా ఉన్నారు. అదెవరో తెలుసా, ఇదుగో పైన చెప్పినట్టు, మూర్ఖుల మనసు మార్చలేమని తెలిసి తెలిసీ వాళ్ళతో వాదనకి దిగేవాళ్ళున్నారు చూడండీ, వాళ్ళది తెచ్చిపెట్టుకున్న మూర్ఖత్వం!

నా స్నేహితుడొకడు మొన్నొకసారి హఠాత్తుగా ఓ పొడుపుకథ పొడిచాడు. "ఒరేయ్! జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది కదా. అలాగే మూర్ఖుడూ మూర్ఖుడూ రాసుకుంటే ఏం రాలుతుంది(తాయి) చెప్పుకో?" అని అడిగాడు. నేను చాలాసేపు ఆలోచించి... రకరకాలుగా ప్రయత్నించి... చించి... ఆఖరికి ఓటమిని ఒప్పేసుకొని వాడినే జవాబు చెప్పమన్నాను. అప్పుడు వాడు, "ఈ మాత్రం తెలీదా, బ్లాగులలో కామెంట్లు!" అని చిద్విలాసంగా ఒక చిరునవ్వు నవ్వి చక్కా జారుకున్నాడు!
"హు... వాడంతే...వాడొక నిజమైన బ్లాగరి (బ్లాగ్ + అరి = బ్లాగులకి శత్రువు)!" అనుకొని వాడన్నమాటని తీవ్రంగా కొట్టిపారేసాననుకోండి. వాడి మాటలకి మీరెవ్వరూకూడా ఏవీఁ "ఫీలు" కాకండేం.

పిడకలవేట సమాప్తం. తర్వాత పోస్టులో తిరిగి మనం తిక్కన దగ్గరికి వెళ్ళిపోదాం.

14, జులై 2009, మంగళవారం

జాతీయాలు-వివరణ

కలగూర గంప , చేట భారతం

కలగూర గంప

కలవేసిన అంటే రకరకాల కూరగాయల గంపను కలగూరగంప అంటారు. కొందరు ఒకే కూరాకునో, ఒకే రకం కాయలనో, పళ్ళనో అమ్ముతారు.మరికొందరు రకరకాల ఆకులూ, కూరలూ, కాయలూ, పళ్ళూ అమ్ముతారు. భిన్న జాతులకు చెందిన కాయగూరలున్న గంప కలగూరగంప. గంప లేకపోయినా కాయకూరల్లేకపోయినా, రకరకాల వస్తువులుంటే కలగూరగంప అనే అంటారు. పదబంధంలో మొదట ఉన్న కల అనేది కలిసేట్లు, కలగాపులగంగా ఉన్న అనే అర్ధం గల విశేషణ పదం ఇది. కలనేత చీరెలో ఒకటికి మించిన రంగుల దారాలు కలిసి ఉంటాయి. కలగాపులగంలో తెల్ల, పచ్చ ఖాద్య, ద్రవ్యాలు కలిసి ఉంటాయి. అలాగే కలగూరగంపలో భిన్నభావాలు, వస్తువులు ఏవైనా కలిసి ఉండవచ్చు. కాయలూ గంపా మాత్రం ఖండితంగా ఉండనక్కరలేదు.

చేట భారతం

ఈ మాటకు చాటు భారతమనే రూపాంతరం ఉందంటారు కొందరు. కానీ ఆ రెంటికి అర్ధాలు వేరు . చేట తెలుగు మాట. చాటు సంస్కృత పదం. అప్పటికప్పుడు చెప్పిన, నోటిమాటగా చెప్పిన అనే అర్ధాలున్న మాట చాటు(వు). చెరగటానికి వాడే చేట తెలుగు వస్తువు. గ్రంధ ప్రమాణాల వంటివి చూపకుండా భారత కథను చెప్తే అది చాటు భారతం.నిజానికది జాతీయమే కాదు. చేట భారతం వేరు.నాలుగు మాటల్లో సరిపొయ్యే విషయాన్ని తెగ సాగదీసి విపులంగా చెపినా, రాసినా దాన్ని చేట భారతమనే అంటారు. అయితే ఈ మాట ఇటీవల పుట్టిందనటానికి నిదర్శనం ఉంది. దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల కిందట, అచ్చు యంత్రాలు అందుబాటులోకి వచ్చిన కాలంలో ఇప్పటి దినపత్రికల కన్నా కొంచెం చిన్నవైన కాగితాల్లో భారతం ముద్రించారు. అంటే చేటంత పెద్ద కాగితాల మీద అచ్చు వేసారన్నమాట. ఆ గ్రంధాలు ఇప్పటికీ కొన్ని పాతకాలపు గ్రంధాలయాల్లో భద్రంగా ఉన్నాయి. సీస పద్యాన్ని అయిదు పంక్తుల్లో, వృత్తాలను రెండు పంక్తుల్లో, కందం, తేటగీతి, ఆటవెలది వంటి పదాలను ఒకే ఒక పంక్తిలో ముద్రించేవాళ్ళు. ఆ గ్రంధాలను కూర్చుని చదవాల్సిందే. అందువల్ల వాటిని చాలా పెద్దవి అనే అర్ధంలో చేట భారతమన్నారు. విస్తరించి చెప్తే చేట భారతం చెప్పినట్టు అవుతుంది

రచన : బూదరాజు రాధాకృష్ణ

ఎక్కడ ఈ అందాలు

ఎక్కడ ఈ అందాలు???


తిన్నామా.... పడుకున్నామా... తెల్లారిందా...

ఈనాడు ఇదే దినచర్య ఐపోయింది చాలామందికి. అది పల్లె అయినా, పట్టణమైనా... ఎక్కడ చూసినా బిజీ , బిజీ.. మూడేళ్ళ పిల్లాడికి కూడా పొద్దున్నే లేచి ఉరుకులు పరుగులతో తయారయ్యే గ్రహచారం పట్టింది. హాయిగా ఒక్కపనీ చేసుకోవడానికి లేదు. తినడం, పాడుకోవడం అన్నీ యాంత్రికమైపోతున్నాయి.. మరి పల్లెలలో ఎలా ఉందో??

తెల్లా వారక ముందే పల్లే లేచిందీ..
తన వారినందరినీ తట్టి లేపిందీ..
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి..
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది..



తెల్లా వారక ముందే



వెలుగు దుస్తులేసుకునీ సూరీడూ..
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో..
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి..
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..



తెల్లా వారక ముందే



పాలావెల్లి లాంటి మనుషులు...
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ..
పల్లె సీమలో కోకొల్లలూ..
అనురాగం.. అభిమానం...
అనురాగం అభిమానం కవల పిల్లలూ..
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ..



తెల్లా వారక ముందే


ఇక్కడ వినండి.

మామూలుగా ఏదైనా పాట వింటే , సంగీతమో, సాహిత్యమో, లేదా ఆ పాట పాడినవారి స్వర మాధుర్యం మనను ఆకట్టుకుంటుంది. ఓహో అనుకుంటాము.. కాని కొన్ని పాటలు అందంగా ఉంటాయి. చాలా సులభమైన తెలుగు పదాలతో ఉంటాయి. ఆ పాట వింటుంటే ఒక అందమైన దృశ్యం మన కళ్లు ముందు కదలాడుతూ ఉంటుంది. అలాంటిదే ఈ పాట. ముత్యాల పల్లకి చిత్రంలో సుశీల పాడిన మల్లెమాల గీతం. నిజంగా ఈ పాట వింటుంటే ఒక అద్భుత దృశ్యం రూపకల్పన చేసుకుంటుంది. వ్యవసాయపు పనులకోసం సూర్యుడికంటే ముందే లేచి పొలాల వైపు అడుగులేస్తారు రైతన్నలు. సూరీడు తూరుపు తలుపు తీసుకుని కాక తోసుకుని వచ్చాడంట. మరి రోజూ చేసే పని తప్పదు కదా.. ఉద్యోగాలు, స్కూళ్ళు ఇలా మనం కూడా అన్ని పనులు టైం ప్రకారం తప్పనిసరై చేయాల్సి వస్తుంది కదా. నింపాదిగా చేస్తే ఎలా కుదురుతుంది. ప్రతి రోజు అలారం పెట్టుకుని అమ్మ లేచి , పిల్లలను లేపుతుంటే పిల్లలకు చిరాకు, స్కూలు బస్సు వెళ్ళిపోతుందని భయమేసి లేస్తారు .. మామూలుగా కాకుండా వెలుగు దుస్తులేసుకుని వచ్చిన సూరీడుని చూసి పాడు చీకటికి కూడా భయమేసి పక్క దులుపుకుని పరుగుతీసిందంట..

కొన్నేళ్ళ క్రిందట పల్లెటూళ్ళలో కుటుంబ సభ్యుల మధ్యే కాక ఊరంతా కూడా అభిమానంగా కలిసి మెలిసి ఉండేవారు. ఎవరింట్లో శుభకార్యమైనా ఊరంతా చుట్టాలే.. అనురాగం అభిమానం కవల పిల్లలూ.. .. ఎంత మంచి ఊహ కదా.. కాని నిజమైతే బాగుండు అనిపించక మానదు ఎవరికైనా..

ఏడువారాల నగలు ..

ఏడువారాల నగలు ..

పూర్వం రాజకుటుంబానికి చెందిన , మిక్కిలి ధనవంతులైన స్త్రీలు ఏడువారాల నగలు ధరించేవారు. అవి వారి ఆడంబర ప్రదర్శనకు, గ్రహాల అనుగ్రహమునకు సరిపోయే విధంగా చేయించుకునేవారు. అంటే రోజు కొక గ్రహాన్ననుసరించి ఒకో రకమైన రత్నాభరణాలు ధరించేవారు . వివిధ ఆభరణాలలో జాతి రత్నాలు పరీక్షించి మరీ పొదిగి అద్భుతమైన నగలు తయారు చేసేవారు .అనంతరం నియమ నిష్టలతో పూజలు జరిపి వాటిని శక్తిమంతం చేసి రోజుకో నగ ధరించేవారు. వారంలో ప్రతి రోజుకు ఒక గ్రహం అధిపతిగా చెప్పబడుతుంది. ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించిన జాతిరత్నాలతో చేసిన ఆభరణములు ధరిస్తే శుభప్రదం అని అనాదిగా నమ్ముతున్నారు .




రవివారం
ఆదివారం నాడు అధిపతి సూర్యుడు. ఈ రోజు సూర్యుని రంగులో ఉండే కెంపులు పొదిగిన ఆభరణాలు ధరించి , లేత ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించి, తమ కుటుంబమును రక్షించమని సూర్యదేవుని ప్రార్ధిస్తారు



సోమవారం
సోమవారం నాడు అధిపతి చంద్రుడు. ఈ రోజు చంద్రుడి రంగులో ఉండే ముత్యాలు పొదిగిన ఆభరణములు ధరించి చంద్రవర్ణంలో (తెలుపు) ఉండే దుస్తులు ధరించి మానసిక ఆరోగ్యాన్ని, ప్రశాంత జీవనాన్ని కలిగించమని చంద్రుణ్ణి ప్రార్ధిస్తారు.



మంగళవారం
మంగళవారం నాడు అధిపతి అంగారకుడు . ఈ రోజు స్త్రీలు అంగారకుని రంగులో ఉండే పగడపు రంగు వస్త్రాలు ధరించి పగడాలతో చేసిన ఆభరణములతో అలంకరించుకుని శక్తిని ,సౌఖ్యాన్ని ప్రసాదించి , రుణబాధలు లేకుండా చేయమని కుజుడిని ప్రార్దిస్తారు.



బుధవారం
బుధవారం నాడు అధిపతి బుధుడు . ఈ రోజు స్త్రీలు ఆకుపచ్చగా, బుధుడి రంగులో ఉండే ఆకుపచ్చని దుస్తులు ధరించి మరకతం ( పచ్చలు)తో చేసిన ఆభరణములు ధరించి మేధోశక్తిని పెంపొందించి, బుద్ధిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఇవ్వమని బుధుడిని వేడుకుంటారు .



గురువారం
గురువారం నాడు అధిపతి గురువు. అతని రంగులో ఉండే లేత పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి కనక పుష్యరాగాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్త్రీలు సంపద, సచ్చీలం పెంపొందాలని గురుడిని ప్రార్దిస్తారు.



శుక్రవారం
శుక్రవారం నాడు అధిపతి శుక్రుడు . ఇతని అనుగ్రహం కోసం తెల్లని రంగులో ఉండే దుస్తులు ధరించి తెల్లని వజ్రాలు పొదిగిన ఆభరణములు ధరించిన స్త్రీలు తమ కుటుంబ జీవనం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని , దాంపత్యం కలకాలం సుఖశాంతులతో వర్దిల్లాలని శుక్రుడిని ప్రార్దిస్తారు .



శనివారం
శనివారం నాడు అధిపతి శని . అతడి శరీరవర్ణమైన నీలం రంగు దుస్తులు ధరించి , నీలంతో చేసిన ఆభరణములు ధరించి తమకు పీడలు , బాధలు లేకుండా చేయమని శనీశ్వరుడిని ప్రార్దిస్తారు.

స్త్రీలు ఇలా గ్రహాలకు సంబంధించిన పూజలు చేసి, తదనుసార జాతి రత్నాభరణములు ధరించడంలో ఆంతర్యం కుటుంబ శ్రేయస్సు మాత్రమే. మనం ధరించే నవరత్నాలు సహజసిద్ధమైనవి ఐతేనే మనకు సరియైన ఫలితం చెకూరుతుంది . ఏడు వారాల నగల పట్ల ఆసక్తి ఉన్నవారు జ్యోతిష నిపుణులు , రత్న శాస్త్ర నిపుణులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా నమ్మకమైన దుకాణములో కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం.

కనీసం ఆరు గ్రహాల స్థితైనా తమ జాతకంలో బావున్నవారు మాత్రమే ఇలా ఏడు రకాల రత్నాలతో ఆభరణాలు తయారుచేయించుకుని ధరించవచ్చు.అలా కాని పక్షంలో మనం కోరుకునే శాంతిసౌభాగ్యాల్ని అవి ప్రసాదించలేకపోవచ్చు. ఉదాహరణకు తమ జాతకంలో కుజస్థితి బాగాలేని స్త్రీలు పగడాలు పొదిగిన నగలు ధరించడం వల్ల వారి భర్తలకు అరిష్టం. లేదా భూమి తగాదాలూ, ఋతుబాధలూ తీవ్రతరమౌతాయి. అలాగే శుక్రుడు యోగించని స్త్రీలు వజ్రాభరణాలు ధరించడం వల్ల దాంపత్యసౌఖ్యలోపం, వ్యభిచార భావాలు, భర్తతో గొడవలు, విడాకులు, సాటి స్త్రీల మూలంగా అశాంతి, వాహనప్రమాదాలు, పొట్టలో ఇబ్బందులు సంప్రాప్తమౌతాయి.జాతకంలో సరిపడని గ్రహాల రత్నాలని ఉంగరంలో పొదిగించి ధరించే పురుషులకు సైతం ఇదే ఫలితం.

అద్భుత భావగీతం

అద్భుత భావగీతం

సంగీతం అంటే ఒక ధ్వని, నాదం మాత్రమేనా. ఒక పాట మన మనసు లోతులను కదిలించి స్పందించేలా చేస్తుంది అంటే దానికి కారణం ఆ పాట సంగీతం, అందులోని సాహిత్యం. గాయకుడి గానామృతం. మన సినిమా పాటలలో నాకు నచ్చినవి మనసుకు హత్తుకునే తక్కువే . ఎన్నో సార్లు ఆలోచించాను. నాకు ఈ కారణాల చేత ఇవి నన్ను ఇంతగా కదిలించాయి అని. ఖచ్చితంగా అది సంగీతం, ఆ పాటలోని పదాల అల్లిక, అలాగే గాయకుడి స్వర మాధుర్యం. ఈ క్రమంలో నటీనటులు గురించి ప్రస్తావన రాదు. నా విషయానికొస్తే పాటలు చూడడం కంటే వినడమే ఇష్టపడతాను. ఒక్కోసారి కొన్ని పాటలు మనలోని బాధను చల్లపరిచి ఆహ్లాదానిస్తాయి. ఆ పాటలలోని అందమైన పదాల అమరిక మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఎన్నో సందేహాలను పరిష్కరిస్తుంది. ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది కూడా. అలాంటి ఒక పాట సిరివెన్నెల చిత్రంలోని విరించినై .. ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అలా అని నేను సిరివెన్నెల గారి అభిమానిని అనలేను. ఆ పాట రాసింది, పాడింది ఎవరైనా సరే. ఎంతో కాలంగా ప్రయత్నించి ఇప్పటికి ఆ పాట అర్ధాన్ని తెలుసుకోగలిగాను.
ఆ విశేషాలు నా బ్లాగులో దాచుకుని , మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

విరించినై విరచించితిని ఈ గీతం
చిత్రం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం :



విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం!
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం!
కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా

విరించినై

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే

విరించినై

నా వుచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సర సస్వర సుర ఝరీగమనమౌ

విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క


తలపున = ఊహలో


ప్రభవించినది = మెరిసినది


అనాది = మొదలు లేని


జీవన వేదం = సృష్టికి మూలమైన వేదం (సృష్టే వేదం, వేదమే సృష్టి)


ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో


స్పందన నొసగిన = ప్రాణాన్ని తట్టి లేపిన


ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము


కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే


ప్రతిబింబించిన = కొలనులో ప్రతిబింబించిన


విశ్వరూప విన్యాసం = సృష్టి యొక్క రూప ఆవిష్కరణ


ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో


ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన


విరించి = బ్రహ్మ యొక్క


విపంచి = వీణ


గానం = సంగీతం


సరస = రసముతో కూడిన( నవరసాల రసం )


స్వర = సంగీత స్వరం (, రి )


సురఝరీ = దేవనది, గంగ


గమనమౌ = ప్రవాహము ఐనట్టి


సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది


నే పాడిన జీవన గీతం గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం


విరించినై = నేనే బ్రహ్మని


విరచించితిని = రచించితిని


ఈ కవనం = ఈ కవిత్వం


విపంచినై = వీణనై


వినిపించితిని = వినిపిస్తున్నా


ఈ గీతం - ఈ పాట


విరించినై...



ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద


దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ


జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు


వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద


పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు


స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట


జగతికి = ప్రపంచానికి , విశ్వానికి


శ్రీకారము కాగా = మొదలు కాగా


విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి


ఇది భాష్యముగా = వివరణగా



విరించినై...


జనించు = పుట్టిన


ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన


జీవన నాద తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల


చేతన = చైతన్యం, అచ్తివషన్


స్పందన = reverberation, రేసోనన్స్


ధ్వనించు = శబ్దం


హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.


అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న


ఆది తాళం = ఆది తాళం


అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా


సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం



విరించినై...



నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి
కవనం = కవిత్వం
నా నిశ్వాసం = వదిలే ఊపిరి,గాలి
గానం = పాట


ఎంత అద్భుతమైన భావం కలిగిన పాట ఇది.

10, జులై 2009, శుక్రవారం

Natural therapy for heart vain opening

Natural therapy for heart vain opening , Please pass it to your colleagues and friends.

For Heart Vein opening

1) Lemon juice 01 cup

2) Ginger juice 01 cup

3) Garlic juice 01 cup

4) Apple vinegar 01 cup

Mix all above and boil in light flame approximately half

hour, when it becomes 3 cups, take it out and keep it

for cooling. After cooling, mix 3 cups of natural honey

and keep it in bottle.

Every morning before breakfast use one Table spoon

regularly. Your blockage of Vein's will open

(No need any Angioplast or By pass)

This is e-mail received from a person working in a Software Company

Dear colleagues, I am working in Blore Software City ..... I wanted to share an incident of my life with you, hoping that it may be an eye opener to you so that you can live more years.

On 27 th October afternoon, I had severe heart attack symptom and I was rushed to the hospital.

After reaching to the hospital, the doctors prescribed a test called angiogram. This test is basically to identify blood flow of heart arteries. When they finished the test they found a 94% block in the main artery, please see the image below with red circle.

image00121.jpg

At this point, I wanted to share my living style, which has caused this block in my heart arteries. Please see the below points of my life style, if any of these points are part of your life style then you are at risk, please change yourselves.

1. I was not doing any physical exercise for more than 10 years , not even walking 30 minutes a day for years .

2.
My food timings are 11:00 AM Breakfast or no ! Breakfast, 3:00 PM to 4:00 PM Lunch and dinner at 11:00 PM to 12:00 AM.

3.
Sleeping in very odd timings, going to bed between 12:00 AM and 3:00 AM. Waking up at between 9:00 AM and 10:30AM ........ Some times spending sleepless nights.

4.
I used to eat heavily because of long gaps between lunch and dinner and I used to make sure that Non-Veg is available most of the time, there were times when I did survey on city hotels to find delicious Non-Veg dishes. I was never inter! ested in vegetable and healthier food.

5.
Above all I was chain smoker from years.

6.
My father passed away due to heart problems, and the doctors say the heart problems are usually genetic.


Once they identified the major block they have done immediately a procedure called angioplasty along with 2 Stints, mean they will insert a foreign body into the heart arteries and open the blocked area of arteries. Please see the below image after the procedure.

image00215.jpg

I learnt from the doctors that 60% people will die before reaching the hospital, 20% people will die in the process of recovering from heart attack and only 20% will survive .. In my case, I was very lucky to be part of the last 20%.

Doctors instructions:


1.
Need to have physical exercise for minimum of 45 minutes daily.

2. Eat your food at perfect timings, like how you eat during your school ! days. Eat in small quantities more times and have lot of vegetables and boiled food, try to avoid fry items and oily food. Fish is good than other non-vegetarian food.

3. Sleep for 8 hours a day, this count should complete before sun rising .

4. Stop smoking.

5. Genetic problems, we cannot avoid but we can get away from it by having regular checkups.

6. Find a way to get relived from the stress (Yoga, Meditation etc).

So I urge you all to please avoid getting into this situation, it is in your hands to turn the situation up side down, by just planning / changing your life style, by following simple points above.

If you find it's useful you can forward this mail to your friends and loved ones.....