1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

31, డిసెంబర్ 2009, గురువారం

Happy New Year

Hi all,

I wish you and your family WISH YOU A HAPPY AND PROSPEROUS NEW YEAR - 2010.

I wish the new will bring you all good and suceess in your life.

Regards

Srinivas
9866983281

28, డిసెంబర్ 2009, సోమవారం

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి




ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

పండగ ఆచరించు విధానం

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
3. అసత్య మాడరాదు.
4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
7. అన్నదానం చేయాలి.

పండుగ ప్రాశస్త్యం
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి

వైఖానసుడి కథ
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు

FW: ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి



సూర్యుడు<http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81> ఉత్తరాయణానికి<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%82&action=edit&redlink=1> మారేముందు వచ్చే ఏకాదశినే<http://te.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BF> వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B1%88%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A0%E0%B0%82&action=edit&redlink=1> వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచిఉంటారు. ఈరోజు మహావిష్ణువు<http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%B5%E0%B1%81> గరుడ వాహనారూఢుడై మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల<http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81> ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.[మార్చు<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%8F%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BF&action=edit&section=1>] పండగ ఆచరించు విధానం

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి<http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BF> తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి<http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BF> నాడు అతిథిలేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాపవిముక్తులవుతారంటారు. ఉపవాసంవల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

పండుగ ప్రాశస్త్యం

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి

వైఖానసుడి కథ

పర్వతమహర్షి<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4%E0%B0%AE%E0%B0%B9%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF&action=edit&redlink=1> సూచనమేరకు వైఖానసుడనే<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B1%88%E0%B0%96%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81&action=edit&redlink=1> రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ

కృతయుగంలో<http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B0%82> ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు<http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%B5%E0%B1%81> మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81&action=edit&redlink=1> మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి<http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF> దుర్గ<http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97> రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

తాత్త్విక సందేశం

విష్ణువు<http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%B5%E0%B1%81> ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&action=edit&redlink=1> (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు<http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A_%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&action=edit&redlink=1> (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.


Thanks & Regards

S.Srinivasa Prasad Rao
9177999263

P Let us do our best to save nature, save water, plant trees, protect greenery, keep our surroundings clean, reduce usage of plastics, and use renewable energy sources.<http://ammasocialwelfareassociation.blogspot.com/>

13, డిసెంబర్ 2009, ఆదివారం

గొల్లపూడి మారుతీరావు గారితో ఇంటర్వ్యూ


మారుతీరావు గారి గురించి పరిచయం అనవసరం కదూ? అడగ్గానే ఈ ఈమెయిల్ ఇంటర్వ్యూకు ఒప్పుకుని, జావాబులు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలతో – సౌమ్య, పూర్ణిమ.
***********************************
మీకు పుస్తకాలు చదవడం ఎలా అలవాటైంది? (పుస్తక పఠనాసక్తి మీకు కలగడానికి ప్రేరేపించిన వాతావరణం, పరిచయాలు గురించి చెప్పండి..)
నేను నా పద్నాలుగోయేటనుంచీ రాస్తున్నాను. అప్పటికే ఏదో చదివేవాడిని. మెల్లగా కూడబలుక్కుని ఇంగ్లీషు కథలు చదివిన గుర్తు. నా మొదటి కథకూడా ఏదో ఇంగ్లీషు కథ పట్ల అవగాహనతో రాసిందనుకుంటాను. మా అమ్మగారు భారత రామాయణాలు శ్రావ్యంగా చదివేవారు. చిన్నతనంలో ఆ స్పూర్తి కొంత ఉపకరించిందని ఇప్పుడు అనిపిస్తుంది. ఏమైనా ఇది ప్రశ్నని బట్టి మెదడులో వెదుకులాటే!
పుస్తకాల ఎంపిక విషయంలో మీ పద్ధతి ఏమిటి?
మొదట్లో ఎంపిక చేయాలనే ధ్యాస లేదు. మన అభిరుచి మేరకి దొరికిన పుస్తకాన్ని చదివే దశ అది. తర్వాత తర్వాత క్రమంగా మన అవసరాలు, ప్రత్యేకమైన విభాగాలు నిర్ణయమై ఆయా పుస్తకాల వెదుకులాట సాగింది. తొలి రోజుల్లో విశాఖపట్నం హిందూ రీడింగ్ రూంలో గ్రంధాలయం, టౌన్ హాల్ రోడ్ లో జిల్లా గ్రంధాలయం అప్పటి నా దేవాలయాలు. ఎప్పుడు తీరిక దొరికినా- నిజానికి ప్రతి దినం అక్కడే వుండేవాడిని.
మీకు ఇష్టమైన రచయితలు ఎవరు?
ఇష్టాయిష్టాలు ఏర్పడే ముందు- ఆయా ప్రక్రియలకు సంబంధించిన అందరూ యిష్టమైనవారే. ఉదాహరణకి- తొలి రోజుల్లో- కొవ్వలి నవలలు- దాదాపు అన్నీ, జంపన నవలలునండూరి రామమోహనరావుగారి అనువాదాలు- టామ్ సాయర్, హాకల్ బెరీఫిన్, మద్దిపట్ల సూరి రెండు మహానగరాలు, కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో నన్ను చాలా సంవత్సరాలు haunt చేసింది. పాంచకడీదేవు అపరాధ పరిశోధక నవలలు, మధిర సుబ్బన్న దేక్షితుల కాశీ మజిలీ కధలు, వేగుచుక్క గ్రంధమాల ప్రచురణలు- ఒకటేమిటి? చేతికందినవన్నీ చదివేవాడిని.
నా పద్నాలుగోయేట వేసవి సలవలకి శ్రీకాకుళంలో పనిచేసే మా చిన్నాయనగారింటికి వెళ్ళాను (ఆయన ఇటీవలే తన 96 వ యేట బెంగుళూరులో కన్నుమూశారు). అక్కడ వున్న రెండు గ్రంధాలయాలకు తలుపులు తెరిచే దగ్గర్నుంచి, “మూసేస్తున్నాం బాబూ!” అనేదాకా కూర్చుని చదివేవాడిని. రెండు నెలల తర్వాత కాలేజీలో చేరితే నాకు క్లాసులో బోర్డు కనిపించలేదు. అప్పుడు అవసరమైన కళ్ళద్దాలు ఈ 57 సంవత్సరాలూ ఉన్నాయి.
మీ పై అత్యధికంగా ప్రభావం చూపిన పుస్తకాలు ఏవి? ఎలాంటివి?
ఈ ప్రభావాన్ని దశలవారీగా చెప్పాలి. తొలినాటి పుస్తకాలు చదువుకొనే ఆసక్తిని పెంచాయి. అవి పైన చెప్పినవి. క్రమంగా రచనకు స్పూర్తిని యిచ్చినవి- ఆ నాటివే. తరువాత శరత్ సాహిత్యాన్ని ఆపోశన పట్టాను. కొన్ని పుస్తకాలు ఎన్ని సార్లు చదివానో! మా ఆవిడ పేరు శివకామ సుందరి. పెళ్ళయిన తొలి రోజుల్లోనే ఆవిడ “శివానీ”అయింది. (శేషప్రశ్న). ఆ రోజుల్లో ఏ ప్రక్రియ అయినా అయస్కాంతం లాగ ఆకర్షించేది. పద్య సాహిత్యం- దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఊర్వశి, కృష్ణపక్షము, ప్రవాసము, ముద్దుకృష్ణ గారి “వైతాళికులు” సంకలనం దాదాపు కంఠతా పట్టినంత చదివాను. ఆ రోజుల్లో పుష్కలంగా కవిత్వం రాసాను. దరిమిలాను పూనకంలాగ చదివిన మరొక రచయిత చెలం. తొలి రోజుల్లో శరత్ ప్రభావం, మలి రోజుల్లో చెలం ప్రభావం నా రచనల మీద ఉంది. తర్వాత నన్ను ప్రభావితం చేసిన నవల బుచ్చిబాబు “చివరకు మిగిలేది’. దాని ప్రభావం నా తొలి నవల “చీకటిలో చీలికలు” మీద వుంది.
ఇక ఇంగ్లీషు సాహిత్యానికి వస్తే టాగూర్ కథలు, గీతాంజలి muse, ఆయన Stray Birds, Leo Tolstoy “The Prisoner of Caucasus”, Jules Verne “Round the world in 80 days” తెలుగులో అనువదించాను. అలాగే చాలా టాగూర్ కధలు. ఇక సోమర్సెట్ మామ్ Cakes and Ale, Moon and Six Pence ఆ దశలో నన్ను ఆకర్షించిన రచనలు.
యూనివర్సిటీకి వచ్చాక నా కాలమంతా ఇంగ్లీషు విభాగంలో గడిచింది. పాత తెలుగు పత్రికల బైండ్లు అప్పటి లైబ్రరీ ఇన్ చార్జ్, ప్రముఖ కవి అబ్బూరి రామకృష్ణారావుగారు ఉంచారు. వాటిలో రచనలు-ఎందరో మహానుభావులవి- నన్ను ప్రభావితం చేశాయి. అక్కడే Preistly, John Galworthy, Eugene O’neill,Somerset Maugham, W.W.Jacobs-ఇలా ఎందరినో చదువుకున్నాను. వెరసి- మీ ప్రశ్నకి సమాధానాన్ని కొన్ని పుస్తకాలకు పరిమితం చెయ్యలేను. అది ఓ రచయిత formative phase. ఎందరో రచయితల filtered consciousness- నాది అయింది అనుకుంటాను.
తర్వాతి కాలంలో Bertolt Brecht, Jean Paul Sartre, Samuel Beckett, Stanislavsky,Christopher Fry నాటకాలు, Bernard Shaw, ముఖ్యంగా Oscar Wilde యొక్క wit, aphorisms నన్ను చాలా ప్రభావితం చేశాయి. మరో రచయిత ఫ్రెంచి నాటక రచయిత Jean Anouillh (అతి ప్రముఖమైన నాటకం Beckett- సినీమాగా కూడా వచ్చింది.)
ఓ దశలో ఓ ఇంగ్లీషు అమ్మాయిని నా రచనలతో ఆకర్షించడానికి కొన్ని నెలలపాటు- బహుశ సంవత్సరం పాటు అసిధారా వ్రతంలాగ ఆంగ్ల పద్యసాహిత్యాన్ని చదివాను. వందల పద్యాలు రాశాను. ఆ దశలో Dylon Thomas, Emile Dickinson, Archbald Macleish, W.B.Yates,Ezra Pound,Edna St.Vincent Millay- ఇలా చదివాను. పద్య సాహిత్యంలో పరిణతి సాధించానని చెప్పను. ఆ museని వంటబట్టించుకున్నాను.
సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో ఆయా దశల్లో ఎందరో ఈ హృదయం తలుపు తట్టారు.
నా ఆత్మ కథ రచనకు మనస్సులో ఆలోచన వచ్చినప్పటినుంచీ కొన్ని వందల ఆత్మకథలు చదివాను. Charles Chaplin “My Autobiography” ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు. అలా లెక్కలేనన్ని సార్లు చదివిన తెలుగు ఆత్మకధ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి “అనుభవాలు-జ్ఞాపకాలూను”. కొన్ని సంవత్సరాలు నన్ను haunt చేసిన మరో ఆత్మకధ ప్రముఖ హాలీవుడ్ నటీమణి Hedy Lamarr “Ecstacy and Me’. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే పెద్ద వ్యాసమవుతుంది. (నిజానికి ఈ విషయమై ప్రత్యేకంగా వ్యాసాన్ని రాశాను.)
ఈ దేశపు ఆధ్యాత్మిక వైభవం మీదా, అవధూతలు, మహానుభావుల అతీంద్రియ శక్తుల మీదా నాకు విశ్వాసం. స్వానుభవంతో కొన్నిటిని తెలుసుకోగలిగాను. నేను నమ్ముతాను. ఆ కారణంగా- లేదా ఈ పుస్తకాల వల్ల నా విశ్వాసం మరింత బలపడింది. అవి- నడిచే దేవుడు- పరమాచార్య గురించి నీలంరాజు వెంకట శేషయ్యగారు రాసింది. సాధన గ్రంధ మండలి ప్రచురణ “శ్రీ కామకోటి దర్శన మహిమలు. Autobiography of a Yogi by Paramahamsa Yogananda, Living with Himalayan Masters by Swami Rama, At The Eleventh Hour(The biography of Swami Rama) by Pandit Rajamani Tigunait లాంటివి నా మనస్సుని చాలా ప్రభావం చేసిన పుస్తకాలు.
సినిమాలు విపరీతంగా ఇష్టపడే వాళ్ళు టికెట్లు సంపాదించిన వీరగాథలను చెప్పుకొస్తుంటారు కదా! అలా మీరు ఏదేని రచనను సంపాదించడం కోసం పడ్డపాట్లు అంటూ ఉన్నాయా?
పైన పేర్కొన్న హెడ్డీ లామర్ ఆత్మకధకోసం చాలా సంవత్సరాలు వెదికాను- మళ్ళీ చదవాలని. అయితే ఆ పుస్తకం పేరు “Tears and Smiles” అని గుర్తు పెట్టుకున్నాను. ఎంత వెదికినా దొరకలేదు. రెండేళ్ళ కిందట హూస్టన్ లో ఒక సభలో ఈ పుస్తకం గురించి చెప్పాను. మరో 15 రోజుల తర్వాత ఆనాటి సభలో ఉన్న ఒకావిడ “Ecstacy and Me’ అన్న ఆత్మకధ కాపీ పంపింది. శీర్షికని తప్పుగా గుర్తు పెట్టుకున్నానని అప్పుడు తెలిసింది. తప్పిపోయిన మనిషి దొరికినట్టు ఆవురావురుమని మళ్ళీ చదివాను.
ఆలిండియా రేడియోలో పని చేసే రోజుల్లో నాతో పని చేస్తున్న ఒకావిడ Paul Brunton రాసిన A Search into Secret India అనే పుస్తకాన్ని ఇచ్చింది. భారతదేశంలో మహిమాన్వితులైన యోగిపుంగవుల్ని కలిసిన ఓ ఫ్రెంచి దేశస్థుని అనుభవాల సంపుటి అది. నన్నెంతో ఆకర్షించింది. ఈ దేశపు అతీంద్రియ శక్తుల మీదా, ఆయా వక్తుల ఔన్నత్యం మీదా విశ్వాసం, అంతకంటే ఎక్కువ ఆసక్తి ఉన్నవాడిని. ఎందరికో అందులో విశేషాలు చెప్తూ వచ్చాను. తర్వాత మరోసారి చదవాలంటే ఆ పుస్తకం దొరకలేదు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కాశీలో ఆ పుస్తకం దొరికింది!
పుస్తకాలు అస్సలంటే అస్సలు ఇష్టపడని మనుషులతో మీ అనుభవాలు ఏవైనా ఉన్నాయా?
తక్కువ. చదవడానికి తీసుకెళ్ళి మనకి వాటిమీద ఉన్న శ్రద్ధని చూపని వ్యక్తులు తెలుసు.
ఇష్టపడని వారు కాదుగాని, బొత్తిగా చదవలేని వారూ, రెండు వాక్యాలు చదవగానే కళ్ళు మూతలు పడతాయని చెప్పినవారూ ఉన్నారు.
ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతాం అన్న ప్రశ్నకు జవాబు మన వయసుతో మారుతూ వస్తుందంటారా? మీ వ్యక్తిగత అనుభవం ఏమిటి?
నిస్సందేహంగా, మారే మన అభిరుచులు, జీవితం చూపే ప్రభావం, ఆలోచనల పరిణతి, దృక్పథం, వయస్సు- ఇవన్నీ నిస్సందేహంగా ప్రభావాన్ని చూపుతాయి. చిన్నతనంలో అభూత కల్పనలు- చందమామ కధలు, కాశీ మజిలీ కధలు ఆకర్షిస్తాయి. తర్వాత వాస్తవిక రచనలు నచ్చుతాయి. క్రమంగా సామాజిక స్పృహ, ఆబ్యుదయం,తిరుగుబాటు, పరివర్తన- వంటి సమస్యలు ఆకర్షిస్తాయి. కొన్నాళ్ళకి చరిత్రలు, ఆత్మకధలు- మర్కొన్నాళ్ళకి భగవద్గీత, ఆధ్యాత్మిక రచనలు,- జీవన యాత్రకీ జిజ్ఞాసి అయిన రచయిత choices కీ దగ్గర సంబంధం వుంది.
పుస్తకాలకి చాలా దూరం అయ్యిపోయానే అని వాపోయిన సందర్భాలు ఉన్నాయా?
లేదు. చదువు కాస్త పలచబడిన సందర్భం నా సినీ నట జీవితం. కాని పుస్తకాలకు దూరమయిన దుర్దశ ఏనాడూ రాలేదు.
ఇన్నేళ్ళ సాంగత్యం తర్వాత “పుస్తకం” మీ జీవితాన్ని ఎలా పెనవేసుకుపోయిందో చెప్పమంటే…. ఏం చెప్తారు?
నాదొక జోక్ ఉంది. నా చేతికి రైల్వే టైం టేబిల్ ఇచ్చి జైల్లో పెడితే ఆరు నెలలు చదువుకొంటా గడపగలను- అంటూంటాను. చదువు నా వ్యసనం. ఇంతకంటే ఈ ప్రశ్నకు సమాధానం అవసరం లేదనుకుంటాను

మీరు తరుచుగా వెళ్ళిన / వెళ్ళే పుస్తకాల షాపులు గురించి చెప్పండి..
నేను రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో దాదాపు ప్రతీరోజూ వెళ్ళి కూర్చున్న పుస్తకాల షాపు విశాఖపట్నంలో హిందూ రీడింగ్ రూంకి ఎదురుగా వుండే గుప్తా బ్రదర్స్. దాని ప్రొప్రయిటర్ జగన్నాధ గుప్తా గారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. వారబ్బాయి రామం నాకు మిత్రులు. షాపులో పుస్తకం ఇంటికి తీసుకువెళ్ళి చదువుకునే అవకాశం రామంగారు నాకు ఇచ్చేవారు. ఇక్కడే శ్రీశ్రీన్, పురిపండా అప్పలస్వామినీ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పన్యాల రంగనాధ రావు వంటి సాహితీ మిత్రుల్ని కలిశాను. చదువు పూర్తయి మొదటి ఉద్యోగానికి(ఆంధ్ర ప్రభ లో) విజయవాడ వచ్చినప్పుడు అప్పటి నవోదయా పభ్లిషర్స్, తర్వాత పి.ఎస్.ప్రకాసరావుగారి నవభారత్ బుక్ హౌస్ నాకు నిరంతరం చేరే గమ్యం. పరపతిని సాధించిన తర్వాత- ఇప్పుడిప్పుడు నాకు ఎందరో రచయితలు తమ పుస్తకాలు పంపుతారు. ఏ సభకి వెళ్ళినా అయిదారు పుస్తకాలతో ఇల్లు చేరుతాను. అప్పుడప్పుడు మద్రాసులో Land Mark కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటాను. ఎప్పుడేనా హైదరాబాదు వెళ్ళినప్పుడు కాచిగుడా దగ్గర నవోదయా బుక్ హౌస్ నన్ను ఆకర్షిస్తుంది.
గ్రంధాలయాల గురించి?
పైన సమాధానం చెప్పాను. నాటకరంగానికి సంబందించిన గ్రంధాలకి, విమర్శక గ్రంధాలకి తరుచుగా మద్రాసులో అమెరికన్ కల్చరల్ సెంటర్ కి వెళ్తాను. నాటక రంగం ప్రసక్తి వచ్చింది కనుక నన్ను చాలా ఆకర్షించిన పుస్తకం ప్రముఖ అమెరికన్ నాటక విమర్శకుడు Walter Kerr “How Not to Write A Play”. ఆత్మకధల విషయంలో “Telling Lives”
పుస్తకాలు చదివే వాళ్ళని “అంత సమయం ఎలా ఉంటుందండీ బాబూ” అని అడిగేస్తూ ఉంటారు జనాలు. అదే మాట మిమల్ని అడిగితే, మీ జవాబు.
వాళ్ళని చూసి జాలిపడతాను. కాని సుళువుగా క్షమిస్తాను.
ఇప్పుడంటే, పుస్తకాల కొట్లు, ఆన్లైన్ షాపింగ్, ఈబుక్స్ ఇలా ఎన్నోమార్గాలున్నాయి. మీ చిన్నతనంలో ప్రధానంగా పుస్తకాలు ఎలా తెచ్చుకునేవారు? గ్రంథాలయాల్లో మనం అడిగిన పుస్తకాలు తెప్పించుకునే సౌకర్యాలు ఉండేవా?
ఈ ప్రశ్నకీ పైన సమాధానం చెప్పాను.
అనుభవం కలిగే కొద్దీ, ఓ పుస్తకాన్ని గానీ, రచయితని గానీ – కొంతవరకూ అంచనా వేయగలమంటారా? (ఆ రచన/రచయితది మనం ఇదివరకు ఏదీ చదవకున్నా కూడా). ఎందుకడుగుతున్నాను అంటే – ఇప్పుడేదన్నా పుస్తకాల కొట్టుకు వెళ్తే, వందల వేల కొద్దీ పుస్తకాలుంటాయి. ఒక్కోసారి మనకసలు ఊరూ పేరూ తెలీని రచయితల పుస్తకాలు చూసి కూడా – ఏ కవర్ పేజీ చూసో, టైటిల్ చూసో ఆకర్షితులమై, అట్టవెనుక కథ చూసి కొనాలి అనుకోవచ్చు. తీరా కొన్నాక అది చెత్త అని తేలొచ్చు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలని (జేబుకి చిల్లు కనుక అవాంఛనీయమే! :) ) చదువరిగా అనుభవం పెరిగే కొద్దీ అరికట్టగలమంటారా?
నిర్డుష్టంగా అంచనా వేయవచ్చు. నన్నడిగితే ఆ వ్యక్తి శీలాన్ని (profile) బేరెజు వేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. వయస్సుని బట్టి, అభిరుచిని బట్టి. మన సంస్కారాన్ని బట్టి, మన అవగాహన స్థాయిన్ బట్టి మనం చదివే పుస్తకం వుంటుంది. మరోలా చెప్తాను. మన చేతిలో ఉన్న పుస్తకం మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఈ వాక్యం రాయగానే గుర్తొచ్చిన విషయం- హత్య కాక ముందు చెర్లపల్లి జైల్లోంచి మొద్దు శీను నా “సాయంకాలమైంది’ నవల చదివి నన్ను గురువుగా భావిస్తున్నానంటూ సుదీర్ఘమైన ఉత్తరం రాశారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది అద్దమా? లేక నా generalisationకి ఇది విపర్యయమా!
మీకు ఫలాని చోట ఫలాని పుస్తకం తప్పక దొరుకుతుంది – వంటి సమాచారం ఎలా దొరికేది, పాతరోజుల్లో?
ఆ ప్రసక్తి లేదు. దొరికే చోటే నేను ఉండేవాడిని కనుక.
మీకు పుస్తకాల ఎంపిక చదవడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఎలా జరిగేది? ఎవరన్నా మీకు ఇవి చదువు..అని తెచ్చి ఇచ్చేవారా? లేక, దొరికినవన్నీ చదువుతూ మీరే మీకంటూ ఓ అభిరుచిని ఏర్పర్చుకున్నారా?
తొలి రోజుల్లో ఆకలితో వున్న వ్యక్తి వంట గదిలోకి దూకిన సందర్భం లాంటిది. చేతికి దొరికిందల్లా చదివాను. చదివిందానిలో ఏ కొత్తయినా మనస్సుని అయస్కాంతంలాగ ఆకర్షించేది.
మిత్రులు చదవమని సూచించిన సందర్భాలు తర్వాతి దశ.
మీరు రచయిత కూడా కదా – మీరు ఫలానా తరహా విషయంపై రాస్తున్నప్పుడు అదే విధమైన వస్తువులపై పుస్తకాలు చదివితే, వాటి ప్రభావం నా రచనపై పడుతుంది అని అనిపించి, చదవడం ఆపేసిన సందర్భాలున్నాయా?
లేదు. లేదు. నిజానికి ఆ విషయానికి సంబంధించిన చదవడమే ఎక్కువ. వాటి ప్రభావం పడడం కన్న ఆ విషయం మరింత focus లోకి రావడం ముఖ్యం కదా?
మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు కళాశాలల్లో రీడింగ్ క్లబ్స్ వంటివి ఉండేవా? ఒకరు చదువుతున్న పుస్తకం గురించి ఇంకోళ్ళతో చర్చించడం – ఇలాంటివి ఏ విధంగా జరిగేవి?
కళాశాలల్లో రీడింగ్ క్లబ్స్ లేవు. కాని విశాఖలో విశాఖ సాహితి సమావేశాలలో రాసిన రచనలు చదువుకొని చర్చించే సంప్రదాయం వుండేది. అలాగే విజయవాడలో మహీధర రామమోహన రావుగారు కొన్ని సమావేశాలు జరిపేవారు. అక్కడ రచనలు చదివి చర్చించుకునే సంప్రదాయం ఉండేది. నేను డిల్లీలో ఉండగా (1959) పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించారు. కపిలకాశీపతి, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, పన్యాల, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, శెట్టి ఈశ్వరరావ్ వంటి వారలు సమావేశమయి- నా “చీకటిలో చీలికలు’ నవలలో కొన్ని భాగాలు, “రాగరాగిణ్’ నాటకం విని చర్చించారు.
పుస్తకాలు ఎంచుకోడం విషయంలో మీరు ఏమన్నా సలహాలు ఇవ్వగలరా? ఇందాక అన్నానే – టైటిల్/కవర్పేజీ వంటివి చూసి మోసపోవడం గురించి – అలాంటివి జరక్కుండా ఉండేందుకు.
చదవడానికి ఏ పుస్తకమూ అనర్హం కాదు. కాగా, మీ అభిరుచే మీ పుస్తకాల ఎంపికన్ నిర్ణయిస్తుంది. టైటిల్ చూసి మోసపోయినా తప్పులేదు. కొన్ని శీర్షికలతో పాఠకుడిని ఎలా మభ్య పెట్టవచ్చో తెలియడమూ విద్యే!
అన్నట్లు, బుక్ ఫెయిర్ల సంస్కృతి మీరు యువకులుగా ఉన్నప్పుడు కూడా ఉండేదా?
ఆ అదృష్టం మాకు లేదు.
నాకు ఎప్పుడూ కలిగే సందేహాన్ని మళ్ళీ మీ ముందుంచుతున్నాను – ఇప్పుడంటే ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలోని ఏమూల సంగతినన్నా తెలుసుకుంటున్నాము. అంతకుముందు ప్రపంచంలోని వివిధ దేశాల సాహిత్యం గురించి ఇక్కడున్న తెలుగువారికి ఎలా తెలిసేది? “ఎంత” తెలిసేది అన్నది పెరుగుతూ వచ్చిందంటారా అప్పటితో పోలిస్తే ఇప్పుడు?
మంచి ప్రశ్న. నా సమాధానం జాగ్రత్తగా చదవండి. ఇంగ్లీషు పాలన వల్ల మనదేశానికి జరిగిన అనర్ఢం మాట పక్కన పెడితే- ఈ దేశానికి దక్కిన అదృష్టం- ఇంగ్లీషు. ప్రపంచ భాషలలో- ఒక్క ఇంగ్లీషు భాషే- ఎటువంటి స్పర్ద లేకుండా ప్రపంచంలోని అంత గొప్పతనాన్నీ తెచ్చుకుంది. మనకి సంస్కృతం రాకపోయినా వేదాల్ని, భగవద్గీతని, మహా భారతాన్ని, శిలాప్పదికరం ని, త్యాగరాజు సంగీతాన్ని, తమిళ పాశురాల్ని, జయదేవుని అష్టపదుల్ని- దేన్నయినా చదువుకోవచ్చు. ప్రపంచ సాహిత్యంలో- సాహిత్యం అన్నమాటేమిటి? అన్ని రంగాల ప్రాశస్త్యాన్ని తమ భాషలోకి తెచ్చుకున్నారు ఇంగ్లీషువారు. నా అదృష్టం- ఏమీ prejudice లేకుండా ఆ భాషని నేర్చుకున్నాను. నేను ఏమీ నష్టపోలేదని తెలుసుకున్నాను.

శ్రీశ్రీ – ‘అనంతం’



ఈ శతాబ్దం నాది” అని శ్రీశ్రీ చేసిన ప్రకvj13_sri-sriటన ఎంత ప్రాముఖ్యత పొందిందో తెలిసిందే. ఈ ప్రకటన కనిపించేది ఆయన ఆత్మకథ ‘అనంతం’ లో. ‘ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల’ అని శ్రీశ్రీ ప్రకటించిన ‘అనంతం’ ఓ క్రమ పద్ధతిలో రాసిన పుస్తకం కాదు. తన జీవితాన్ని గురించి వివిధ పత్రికలలో రాసిన అనేక వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కవిగా, కమ్యూనిస్టుగా, సినిమా రచయితగా ప్రపంచానికి తెలిసిన శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి, కమ్యూనిజాన్ని గురించీ, సినిమాల గురించీ తన అభిప్రాయాలను చాలా సూటిగా వ్యక్త పరిచారు.
విశాఖపట్నం లో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన శ్రీరంగం శ్రీనివాసరావు బాల్యం చాలా వైభవంగా గడిచింది. సవతి తల్లి సుభద్రమ్మ కన్నతల్లిని మించి పెంచింది. తండ్రి వెంకట రమణయ్య కొడుకుని స్నేహితుడిగా చూశాడు. “నా పద్దెనిమిదో ఏట మొదటి సారి సిగరెట్ తాగాను. సిగార్స్.. నాన్నే కొనిచ్చారు..” ఈ వాక్యాన్ని బట్టి ఆ తండ్రి కొడుకుల అనుబంధాని అర్ధం చేసుకోవచ్చు. శ్రీశ్రీ పెళ్ళయిన కొత్తలో భార్యని విడిచి కృష్ణశాస్త్రి వెంట వారం రోజులు విజయనగరంలో గడిపినప్పుడు మాత్రం సున్నితంగా మందలించారు రమణయ్య.
పుట్టిన ఊరిపట్ల తన మమకారాన్ని ఏమాత్రం దాచుకోలేదు శ్రీశ్రీ. ఎగసిపడే సముద్ర కెరటాలు తనలో కవితావేశాన్ని ఎలా రగిల్చాయో, పెరుగుతున్న పారిశ్రామికీకరణ తనలో కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపిందో వివరించారు. శ్రీశ్రీ కి తొలిసారి ‘బయోస్కోప్’ పరిచయమైంది విశాఖ లోనే. సినిమాల పరంగా ఇరవయ్యో శతాబ్దం చార్లీ చాప్లిన్ ది అన్నారు. అంతర్జాతీయ సినిమాల గురించి విస్తారమైన నోట్సు లభిస్తుంది ఈ పుస్తకంలో. తెలుగు సినిమా ఎదగడం లేదన్న అభిప్రాయం చాలాచోట్ల ప్రకటించారు.

బాల్యంలో యెంతో వైభవం అనుభవించిన శ్రీశ్రీ యవ్వనంలో దరిద్రాన్ని అనుభవించారు. జీవిక కోసం ఎన్నో ఉద్యోగాలు చేశారు. కవిత్వాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. సినిమాలకు రాయడం కేవలం బ్రతుకు తెరువు కోసమే అన్నారు. “అనంతం లో మోతాదును మించి సెక్సును ప్రవేశ పెట్టానని నేననుకోను” అన్నారు కానీ, ఇందుకు సంబంధించిన విషయాలు చాలా చోట్ల కనిపిస్తాయి. అయినా ‘ఆత్మకథ’ లో ‘మోతాదు’ ను నిర్ణయించగలిగేది ఎవరు?
రమణమ్మ తో బాల్య వివాహం, సరోజ తో ద్వితీయ వివాహం లాంటి వ్యక్తిగత విషయాలతో పాటు, అరసం పుట్టుక, ఎదుగుదల, విరసం పుట్టుకకి దారితీసిన పరిస్థితులనూ సవివరంగా రాశారు. కృష్ణశాస్త్రి పట్ల అభిమానాన్నీ, విశ్వనాథ రచనా శైలి పట్ల తన అభిప్రాయాలనూ సూటిగా ప్రకటించారు. మిత్రుడు కొంపెల్ల జనార్ధన రావు గురించి సుదీర్ఘంగా వివరించారు. తన తండ్రి తర్వాత గురు స్థానం ఇచ్చిన రెండో వ్యక్తి అబ్బూరి రామకృష్ణా రావు కోసం ఓ అధ్యాయం కేటాయించారు.

కవిత్వాన్ని గురించి రాసినంత వివరంగానూ, తన విదేశీ పర్యటనల గురించీ రాశారు శ్రీశ్రీ. రష్యా ఆయనని ఎంతగానో ఆకట్టుకుంది. భారత దేశాన్ని ఎప్పటికైనా రష్యా లా చూడాలన్నది ఆయన ఆకాంక్ష. చైనా వెళ్ళే అవకాశం ‘రాజకీయ కారణాల’ వాళ్ళ మిస్ కావడం మొదలు, స్టాక్ హోం, మాస్కో పర్యటనలు, ఆయా దేశాల్లో తనకి నచ్చిన సంగతులను కళ్ళకు కట్టినట్టు రాశారు. విరసం లో సమస్యలు, తనపై వచ్చిన ఆరోపణలు, వాటికి శ్రీశ్రీ ఇచ్చిన వివరణలతో ముగుస్తుంది ఈ పుస్తకం.

‘అనంతం’ అన్న పేరు ఈ పుస్తకానికి సరిగ్గా సరిపోతుంది. ప్రారంభం, ముగింపు లేని రచన ఇది. కొన్ని కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ వచ్చి కొంచం విసుగు కలిగిస్తాయి. ఓ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కమ్యూనిజం వైపు ఆకర్షితుడు కావడానికి దారి తీసిన పరిస్థితులేమిటో శ్రీశ్రీ నోటి నుంచి వినలేము. పుస్తకం పూర్తీ చేశాక మొత్తం సంఘటనలని ఓ క్రమంలో పేర్చుకున్నా, చాలా చోట్ల ఖాళీలు కనిపిస్తాయి. ఈ ఆత్మకథలో ఎదుటివారి — ముఖ్యంగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నవారి — వ్యక్తిగత విషయాలను రాయడం నాకు కొరుకుడు పడలేదు. తనకు సంబంధించిన విషయాలను చెప్పేటప్పుడు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించిన శ్రీశ్రీ, ఎదుటి వారని కొన్ని చోట్ల చిన్నబుచ్చారనిపిస్తుంది.

కేవలం శ్రీశ్రీ ని గురించే కాక, గడిచిన శతాబ్దం లో రాష్ట్రంలోనూ, అంతర్జాతీయంగానూ జరిగిన పరిణామాలను గురించి తెలుసుకోవాలనే వారికి ఉపయోగపడే ‘అనంతం’ ని విశాలాంధ్ర ప్రచురించింది. అభ్యుదయ సాహిత్యం

మహనీయుల గురించి...



బాలలూ మన భారతదేశంలో ఋషులు, ప్రవక్తలూ, మహాత్ములూ, మేధావులూ, శాంతిదూ తలూ, వీరులూ, త్యాగులూ, ధాన ధర్మాత్ములూ... ఇలా ఎందరో మహాను భావులు పుట్టారు. ఆ మహనీయుల చరిత్రను స్మరించు కుంటూ మన జీవితాలని బాల్యం నుంచే సరిదిద్దుకుంటూ, దేశభక్తితో జీవించడానికి ప్రయత్నించాలి.

గాంధీజీ
జాతిపిత మహాత్మా గాంధీజీని గురించి ఎంత తెలుసు కున్నా తక్కువే అవుతుంది. నిరంతరం ఆ మహాత్ముని స్మరిం చుకుంటూ ఆయన ఆశయాలని బాలలైన మీరు ఇప్పట్నుంచే అలవర్చుకోవాలి, ఆచరించాలి.
వెూహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీకి తల్లిదండ్రులంటే ఎంతో భక్తీ, గౌరవాలుండేవి. తల్లి అంటే గాంధీకి అమిత మైన ప్రేమ! అతడామె ఆజ్ఞలన్నిటినీ కూడా మూఢంగా అను సరించేవాడు. బాల్యం నుంచే గాంధీజీ తాను మంచిదని నమ్మిన సిద్ధాంతాన్ని తల్లి చెప్పినా కూడా ఏ మాత్రం వినే వాడు కాడు. ఒకసారి తన అన్న గాంధీని కొట్టి అవమాన పర్చాడని తల్లితో వెళ్లి ఫిర్యాదు చేశాడు. తల్లి పుత్లీభాయికి కోపం వచ్చింది. ''వెంటనే అన్నయ్యను మళ్లీ తిరిగి కొట్టలేకపోయావా!'' అని తల్లి ప్రశ్నించింది. వెూహన్‌గాంధీకి ఆశ్చర్యం వేసి తల్లివంక చూస్తూ ''అమ్మా! నీవు నన్ను తిరిగి అన్నయ్యను కొట్టమని బోధిస్తున్నావేమిటి నేనెవరినైనా ఎందుకు కొట్టాలి... కొట్టినవాడ్ని అలా కొట్టకూడ దని పిలిచి చెప్పడానికి బదులు దెబ్బలు తిన్న నన్ను తిరిగి అన్నయ్యను కొట్టమని చెబుతావేమిటమ్మా!'' అని ప్రశ్నించాడు బాల గాంధీ. అపðడు అతని విజ్ఞతకు తల్లి ఎంతో మెచ్చుకుంది. చిన్నతనంలోనే అం తటి తెలివితేటలు గల వాదన అలవడినం దుకు ఆశ్చర్యంతో పాటు సంతోషపడ్డది.
చూశారా బాలలూ! ఏ మంచి కార్య క్రమాలైనా చిన్నప్పట్నుంచే అలవర్చు కోవాలి. ఏది మంచి, ఏది చెడు అని గ్రహించి ఎపðడూ మంచిగానే గ్రహిం చాలి. అదే మీ జీవితాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు పయనింపచేస్తుంది.

లోహియా
దేశభక్తుడు, సృజనాత్మక ప్రతిభగల రామ్‌ మనోహర లోహియా జీవితంలోని ఓ చిన్న సంఘటన గురించి ముచ్చటించుకుందాం.

1930లో నానారాజ్య సమితి జరుగుతోంది. ఉన్నట్టుండి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఒక పెద్ద 'ఈల' వినిపించింది. అంతా చకితులై చూశారు ఈల వేసి వ్యక్తి వైపు. భారతీయ ప్రతినిధిగా వచ్చిన అప్పటి బికనీర్‌ మహారాజా తాను ప్రసంగిస్తున్న భాషను నిలిపి ప్రేక్షకుల గ్యాలరీ వైపు ఈల వేసిన ఆ వ్యక్తి వైపే తెల్లబోయి చూస్తూండిపోయాడు. భారతదేశంలోని బ్రిటీష్‌ పాలనా శ్రేష్ఠత్వాన్ని గురించి ఏకధాటిగా ఉపన్యసిస్తున్నాడు బికనీర్‌ మహారాజా ఆనాటి నానారాజ్య సమితిలో. అపðడు ఆ అబద్ధాల పొగడ్తల ప్రసంగాన్ని వినలేక అసమ్మతిగా 'ఈల' వేశాడు రామ్‌ మనోహర లోహియా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి.

వెంటనే అక్కడున్న కొందరు లోహియాను బలవంతం గా బయటకు పంపివేశారు. అపðడు లోహియా వయస్సు 20 సంవత్సరాలు మాత్రమే. అపðడు ఆయన 'బెర్లిన్‌ విశ్వ విద్యాలయం'లో అధ్యయనం చేస్తూండేవాడు. భారతదేశం లో బ్రిటీష్‌ పాలనా విధానాలను గురించి బికనీర్‌ మహారాజా చేయబోయే ప్రసంగాన్ని వినాలనే కుతూహలం కొద్దీ లోహియా బెర్లిన్‌ నుంచి జెనీవా వచ్చాడు. ఆ ప్రసంగం ఏ మాత్రం నచ్చని లోహియా ధైర్యంగా వ్యతిరేకిస్తూ ఈల వేయ టం సామాన్యమైన విషయం కాదు. చూశారా బాలలూ! ఆయన నరనరాలలో 'దేశభక్తి' ఎలా పొంగి పొర్లిందో! అలాంటి దేశభక్తి మీలో పెం పొందించు కోవాలి.

శరత్‌బాబు
గొప్ప బెంగాలీ రచయిత శరత్‌ బాబును గురించి తెలియని సాహిత్య పరుడు ఉండడు. ఆయన నవలలు, కథలు యథార్థ జీవితాలకు అద్దం పడు తాయి. బాల్యం నుంచి కూడా శరత్‌ చాలా కష్టనష్టాల్నీ బాధల్నీ అనుభవించిన గొప్ప రచయిత. ఆయన విశిష్ట వ్యక్తి త్వాన్ని ఎత్తిచూపే ఈ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుందాం బాలలూ!
'దేశబంధు' చిత్తరంజన్‌దాసుని తెలి యనివారుండరు. రాజకీయనాయకుడిగా, లాయర్‌గా, కవిగా ప్రసిద్ధుడు ఆయన.
అప్పట్లో 'నారాయణ' అనే ఒక సాహిత్య పత్రికాధిపతిగా ఉండేవారు ఆయన. చిత్తరంజన్‌ కోరిక ప్రకారం శరత్‌బాబు 'స్వామి' అనే ఒక కథను రాసి పంపిం చాడు. ఆ కథను చదివిన దాసు తన్మయుడై తిరుగు టపాలో ఓ బ్లాంక చెక్కుని శరత్‌బాబుకి పంపాడు. దాంతోపాటు ఆయన ఓ ఉత్తరాన్ని కూడా జత చేశాడు. అందులో ''మహౌ న్నతమైన ఒక రచయిత నుంచి ఓ గొప్ప కథను సంపా దించాను. దానికి ఇంత అని వెలకట్టే సాహసం నాకు లేదు. అందుచేత ఈ ఖాళీ చెక్కును మీకు పంపాను. ఈ కథకు మీ ఇష్టం వచ్చినంత మొత్తాన్ని ప్రతిఫలంగా వేసొకొని మార్చుకొనవచ్చును'' అని వివరంగా రాశాడు.

శరత్‌బాబు ఆ ఉత్తరాన్ని, చెక్కును చూసి సంతోష పడ్డాడు. ఆ బ్లాంక చెక్కులో కేవలం మూడు రూపాయలే వేసుకొని మార్చుకున్నాడట!

చూశారా బాలలూ! శరత్‌బాబు ప్రతిష్ట, ఆయన నిజా యితీ తత్త్వం. వ్యక్తిత్వ వికాసం జీవితాన్ని ఆనందమయంగా మారుస్తుంది. ఉన్నతమైన సద్గుణాలు బాల్యం నుంచే పెంపొం దించుకోవాలంటే మహనీయుల జీవిత చరిత్రల్ని చదవాలి, ఆచరిస్తూ రావాలి. నేటి విజ్ఞానవంతులైన బాలలే ఉజ్వల భావి పౌరులుగా రాణిస్తారు

6, డిసెంబర్ 2009, ఆదివారం

Magnificent Temples of India

 

ü  Kedarnath temple, Kedarnath, Uttarakhand

 

ü  Pashupatinath temple, Kathmandu , Nepal

 

ü  Lord Kalabhairaveshwara Temple , Adichunchanagiri Math (95 Kms from Bangalore ), Karnataka

 

ü  Sri Dharmasthala Manjunatheshwara Temple, Dharmasthala (75 kms from Mangalore), Karnataka

 

ü  Trimbakeshwar Temple , Nasik , Maharashtra

 

ü  Sri Krishna Temple, Guruvayur, Kerala

 

ü  Sri Shantadurga temple, Ponda, Goa

 

ü  Suchindram Temple, Kanyakumari, Tamil Nadu..

 

ü  Sri Madhuru Madananteshwara Siddivinayaka Temple, Madhur (50 kms from Mangalore), Kerala

 

ü  Sri Padmanabhaswamy Temple, Tiruvananthapuram, Kerala

 

ü  The best part of the temple is the the huge idol of Lord Vishnu sleeping over the snake is turning into gold(it weighs almost 700 kg)! It is believed that when Mahmud of Ghazni invaded India in the middle ages, the people of the then kingdom invented a black coating which would not wear out even by the strongest chemicals. They coated the large idol with this so that the plunderers wont come to know that its made up of gold. they were unable to remove the coating after the invaders left. But recently, in the past 10 yrs or so the coating is finally wearing out little by little.

 

ü  Sri Virupaksha Temple, Hampi, Karnataka

 

ü  Sri Venkateswara Temple, Tirumala, Andhra Pradesh

 

ü  Sri Gokarnanatheshwara Temple, Mangalore, Karnataka

 

ü  Sri Ramanathaswamy Temple Corridor, Rameshwaram, Tamil Nadu

 

ü  Sri Ranganathaswamy Kovil ( Temple ), Srirangam (Near Trichy), Tamil Nadu

 

ü  Arulmigu Meenakshi Sundareswarar ThiruKovil, Madurai , Tamil Nadu

 

ü  Shore Temple, Mahabalipuram, Tamil Nadu

 

ü  Arulmigu Arunachaleswarar Temple , Thiruvannamalai, Tamil Nadu

 

ü  Brihadeeshwar temple, Thanjavur, Tamil Nadu.----------The Gopuram of this Temple does not cast any Shadow. Also the Vimaanam( top of the gopuram) of this temple is made of one Single Stone.

 

ü  Nataraja Temple, Chidambaram, Tamil Nadu

 

ü  Sree Seetha Ramachandra Swamivari Temple, Bhadrachalam, Andhra Pradesh

 

ü  Sri Kalahastheshwara Temple, Kalahasti, Andhra Pradesh-----The Only Hindu Temple in the world which is opened even during Lunar and Solar Eclipses as the Graha Doshas do not effect this Temple .

 

ü  Kanchi Kamakshi Amman Temple, Kancheepuram, Tamil Nadu

 

ü  Arulmigu Sarangapani Temple - Kumbakonam, Tamil Nadu

 

ü  Tiruchendur Sri Subrahmanya Swami Devasthanam, Tiruchendur, Tamil Nadu

 

ü  Sri Sharadamba Temple, Sringeri Sharada Peetham, Sringeri (101 kms from Mangalore), Karnataka

 

ü  Sri Hoysaleshvara Temple, Halebidu (Near Hassan), Karnataka

 

ü  Sri Chennakesava Temple, Belur (Near Hassan), Karnataka

 

ü  Chamundeswari Temple , Chamundi Hills, Mysore , Karnataka

 

ü  Sri Krishna Mutt/Temple, Udupi , Karnataka.

 

ü  Murudeshwara Temple , Murudeshwar (165 kms from Mangalore), Karnataka.

 

ü  Dakshineswar Kali Temple, Kolkata, West Bengal