1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

31, మే 2009, ఆదివారం

United States of india - ఇదొక ధనికదేశం.


ఫోన్ : లబ్బరు గాజులు లబ్బరు గాజులు లబ్బరు గాజులు తెచ్చానే...

స్వదేశ్ కుమార్ : (ఎత్తి) హలో ! యెస్ స్వదేష్ స్పీకింగ్ !

విదేశ్ రావ్ : హలో స్వదీ ! నేనేరా విదీని ! ఎలా ఉన్నావ్ ?

స్వదేశ్ : ఓహ్ నువ్వా ? నా సంగతి సరే గానీ నువ్వెలా ఉన్నావురా అమెరికాలో ?

విదేశ్ : నేనిప్పుడు అమెరికాలో లేన్రా ! ఇక్కణ్ణుంచే మాట్లాడుతున్నాను.

స్వదేశ్ : వార్నీ ! వ్హాటే ప్లెజెంట్ సర్‌ప్రైజ్ ! చెప్పాపెట్టకుండా అమెరికా నుంచి ఎప్పుడొచ్చేశావురా ? సరే ! డైరెక్టుగా ఇంటికొచ్చేయ్, మాట్లాడుకుందాం !

విదేశ్ : వచ్చేవాణ్ణే గానీ స్వైన్ ఫ్లూ టెస్టులు చేస్తామని చెప్పి ఇక్కడ షమ్సాబాద్ ఎయిర్ పోర్టులో మమ్మల్ని లగేజితో సహా ఆపేశార్రా ! తరువాత మా అడ్రస్సూ, ఫోన్ నంబరూ తీసుకుంటారట. నాకు హైదరాబాదులో సొంత అడ్రస్సేం లేదు గదా ! అందుకని నీ మెయిలింగ్ ఆడ్రస్ కొంచెం చెప్తావా, నోట్ చేసుకుంటాను ?

స్వదేశ్ : సరే రాస్కో ! కేరాఫ్ స్వదేష్ కుమార్, హౌజ్ నంబర్ 12-34-567/3a/abc/ijk/pqr/xyz....

విదేశ్ : చచ్చాం పో, ఇదేం నంబర్రా బాబూ ?

స్వదేశ్ : హహ్హహ్హా ! మా హైదరాబాదులో ఇళ్ళ నెంబర్లన్నీ ఇలానే ఉంటాయ్ - అనగా ఇలాగే తగలబడతాయ్.

విదేశీ : సరే, రాసుకున్నా. తరవాత ?

స్వదేశ్ : తరవాత.... కుతుబ్ షాహి టూమ్స్ చౌరస్తా....

విదేశ్ : ఆగాగు, ఒక విషయం చెప్పు. నువ్వుండేది టూమ్స్ దగ్గరా ?

స్వదేశ్ : అబ్బా ! టూమ్స్ అంటే టూమ్స్ కాదురా ! ఒక విషయం అర్థం చేస్కో, హైదరాబాదులో పేరుకీ ఏరియాకీ సంబంధం లేదురా బాబూ ! గోల్కొండ చౌరస్తా అంటారు. అక్కడ గోల్కొండ ఉండదు. చార్మినార్ చౌరస్తా అంటారు. అక్కడ చార్మినార్ ఉండదు.

విదేశ్ : అయితే దీనికి హైదరాబాదనే పేరు తీసేసి మాయాబజార్ అంటే బావుంటుందేమో !

స్వదేశ్ : అదేదో నువ్వు సి.ఎమ్. అయ్యాక ఆలోచించు. ప్రస్తుతానికి అడ్రస్ రాస్కో !

విదేశ్ : సరే, చెప్పు !

స్వదేశ్ : సాయిగణేష్ ఎంక్లేవ్... ఆనంద్ నగర్ కాలనీ... అవంతీ ఎస్టేట్స్... ధర్మాపూర్ లేయౌట్... బాలాపూర్ రోడ్డు... హైదరాబాద్.

విదేశ్ : మై గాడ్ ! ఎక్కడైనా ఒక కాలనీ, ఒక ఏరియా ఉంటుంది. నీ ఒక్క కొంపకి పరమపద సోపానపటంలా ఇన్ని పూర్ లేంటి ? నగర్ లేంటి ? లేయౌట్ లేంటి ? ఎంక్లేవులేంటి ? వింటూంటే పిచ్చెక్కిపోతోందిరా నాయనా ! అసలీ అడ్రస్ పట్టుకుని నువ్వు రోజూ ఆఫీసు నుంచి తిన్నగా ఇంటికి చేరుకోగలుగుతున్నావా ? అని !

స్వదేశ్ : అసలు జీవితం గాడితప్పినవాడే దారితప్పి హైదరాబాదొస్తాడ్రా. మళ్ళీ ఇక్కడ దారితప్పితే అదో పెద్ద ఇష్యూ కాదులే !

విదేశ్ : నువ్వన్నది నిజంరా ! నేను కూడా నా అమెరికా జీవితం గాడి తప్పడం వల్లే హైదరాబాదొచ్చా.

స్వదేశ్ : అంటే ?

విదేశ్ : అంటే ఏముంది ? నీకు తెలుసుగా, క్రైసిస్ ఎలా ఉందో ! యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాస్తా అనెంప్లాయ్డ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిపోయింది. ఇదివరకులా ఉజ్జోగాలూ, సజ్జోగాల్లేవ్. నా ఉజ్జోగానిక్కూడా ఎసరొచ్చింది. నా వీసా కూడా రిన్యూ చేసే అవకాశం లేకపోయె. దాన్తో "నా జన్-మ-భూ-మి ఎన్-తా అన్-ద-మైనా దేశమూ...." అని పాడుకుంటూ ఇక్కడికొచ్చిపడ్డా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాకి !

స్వదేశ్ : బాధలో ఉన్నా భలే చెప్పావురా విదీ ! మరి నీ భవిష్యత్ ప్రణాళికేంటి ? ఇక్కడే పర్మనెంటుగా ఉందామనా ? మళ్లీ స్టేట్స్ వెళదామనా ?

విదేశ్ : నా చేతిలో ఏముందిరా ? నేను అనుకుని ఇక్కడికొచ్చానా, అనుకుని అక్కడికెళ్ళడానికి ? ముందిక్కడేదైనా జాబ్ చూసుకుని తరవాత ఆలోచిస్తా. కానీ ఎంత స్వదేశమైనా ఒరే, అక్కడ అన్నేళ్ళు ఉండొచ్చాక ఇక్కడుండడం కష్టమేరా బాబూ !

స్వదేశ్ : కష్టమంటే ఏ దృష్టితో నంటావ్ ?

విదేశ్ : ఎంత క్రైసిస్ లో ఉన్నా ఆ వాతావరణం వేరు. ఆ మనుషులు వేరు. ఆ థాట్ క్లైమేట్ వేరు. మంచి రూల్సు, రెగ్యులేషన్సు ఉంటాయి. అందరూ పాటిస్తారు. ఇక్కడ అంతా ఖరాబోళ్ళు, గరీబోళ్ళు. రూల్సు పెట్టినా ఎవడూ పాటించడు. పాటించే వాతావరణం లేదు. అక్కడ యాభై స్టేట్స్ ఉన్నా అన్ని ఉన్నట్లే ఉండదు. చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది. ఇక్కడైతే ఎప్పుడూ ఏదో ఒక గోల, గొడవ, గందరగోళం, న్యూసెన్సు. ఎలా ఉండగలనా ? అని ఆలోచిస్తున్నాను.

స్వదేశ్ : యు ఆర్ మిస్టేకెన్ మ్యాన్ ! అంత డిసిప్లిన్ లేకపోవచ్చు గానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కూడా బాగా డబ్బున్న దేశమే.

విదేశ్ : ఒరే స్వదీ ! నాకెంత జాబ్ లేకపోతే మాత్రం, ఇలాంటి పూర్ జోక్సేసి నవ్వించాలని చూడకురా బాబూ, చిరాగ్గా ఉంటుంది.

స్వదేశ్ : జోకులు కాదురా ! నిజమే చెబుతున్నా.

విదేశ్ : అదే, ఏంటా నిజం ? అనడుగుతున్నా.

స్వదేశ్ : మొన్న జరిగిన ఎన్నికల్లో మనవాళ్ళు ఎంత డబ్బు తగలేశారో తెలుసా ? ఒక్క ఆంధ్రాలోనే వెయ్యికోట్లు పెట్టారు. డెవలప్డ్ కంట్రీలూ గాడిదగుడ్డు అంటావ్, ప్రపంచంలో ఎక్కడున్నారో చూపించరా నాకు - మనలా ఖర్చుపెట్టేవాళ్ళు !

విదేశ్ : అవున్రా ! ఇందులో ఇండియానే గ్రేట్ ! అయినా అంతమాత్రానే ఇండియా రిచ్ అంటే ఎలా ?

స్వదేశ్ : తొందరపడకు, ఇంకా ఉంది విను. ఎందులో చూసుకున్నా ఇండియానే రిచ్చి. నువ్విప్పుడు హైదరాబాద్ నుంచి మీ స్వగ్రామం వెళ్లాలంటే నీకు టిక్కెట్లు దొరకవ్.

విదేశ్ : అదేంట్రా ?

స్వదేశ్ : అదంతేరా ! పనీపాటా లేకుండా, ఒకవేళ ఉన్నా ఎగ్గొట్టి మరీ డబ్బులు తగలేసి, బస్సులూ, రైళ్ళూ ఎక్కి చుట్టాల్నీ, పక్కాల్నీ చూడ్డానికి వెళ్ళే దర్జా మనవాళ్ళకే సొంతం. అందుకని నీకు టిక్కెట్లు దొరకవ్. ఏ డోరుకో, కిటికీకో వేళ్ళాడుతూ వెళ్ళాల్సిందే.

విదేశ్ : మై గాడ్ ! మళ్ళీ అదొకటా ?

స్వదేశ్ : అదొక్కటే కాదురా ! ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాటడుగుతా చెప్పు. మీ దేశంలో క్రిస్మస్ ఏడాదికి ఎన్నిసార్లు జరుపుకుంటారు ?

విదేశ్ : ఛ ! ఇదేం ప్రశ్నరా ? ఒక్కసారే గదా !

స్వదేశ్ : ఛ ! దట్స్ వై ఐ పిటీ యుఎస్. ద పూర్ కంట్రీ ! మేమిక్కడ దీపావళి ఎన్నిసార్లు జరుపుకుంటామో తెలుసా ?

విదేశ్ : ఆఁ ఎన్నిసార్లేంటి ?

స్వదేశ్ : ఎన్నిసార్లంటే అది మాకే తెలీదు, నీకేం చెప్తాం ?

విదేశ్ : అదేంట్రా ? మన చిన్నప్పుడు మామూలుగా ఏడాదికోసారి జరుపుకునేవాళ్ళం కాదూ ?

స్వదేశ్ :ఇప్పుడంతా మారిపోయిందిరా ! ఇప్పుడిక్కడ మనకి నిత్యదీపావళి. అదే మన గ్రేట్ నెస్. బర్త్ డే రోజు టపాసులు కాలుస్తాం, పెళ్ళిరోజు కాలుస్తాం. పిల్లలు పుడితే కాలుస్తాం. రిజల్ట్స్ వస్తే కాలుస్తాం. రిజల్ట్స్ రాకపోయినా కాలుస్తాం. పరీక్షలు అయిపోతే కాలుస్తాం. పరీక్షలు జరక్కపోయినా కాలుస్తాం. ఎన్నికల్లో గెలిస్తే కాలుస్తాం, ఓడిపోయినా కాలుస్తాం. దీపం వెలిగిస్తే చాలు, ఫైరింజన్ వేసుకొచ్చి గగ్గోలు పెట్టే పిరికిదేశంరా మీది. మా డబ్బూ, మా ధైర్యం మీకెక్కడివిరా ?

విదేశ్ : నిజమేరా బాబూ ! ఈ విషయంలో కూడా ఇండియానే గ్రేట్.

స్వదేశ్ : చూశావా ? ముందు పూర్ జోక్ అదీ ఇదీ అన్నావ్. ఇప్పటికి నీతో ముచ్చటగా మూడుసార్లు ఒప్పించాన్రా, ఇండియానే రిచ్ అని !

విదేశ్ : ఖర్చుదేముందిరా ? ఎవడైనా పెడతాడు. పదికోట్లు కూడా పది నిమిషాల్లో తగలెయ్యొచ్చు. సంపాదించడంలోనే ఉందిరా అసలైన గొప్పతనం. ఇండియాలో ఎవరికుందిరా అంత సంపాదన ?

స్వదేశ్ : అక్కడే ఉందిరా మాకూ, మీకూ తేడా ! మీకు ఆఫీసుకెళితే గానీ డబ్బు రాదు. కళ్ళు తెరిచి చూడాలే గానీ ఇండియాలో ఎటు చూసినా డబ్బే. అసలు ఎప్పుడూ లక్ష్మీదర్శనానికి నోచుకోని దరిద్రజీవితం గదరా మీది.

విదేశ్ : ఒరే ! ఒరే ! స్వదీ ! అమెరికాని అలా అంటే నేనొప్పుకోన్రా ! నాక్కోపమొస్తుంది. అసలు నీ ఉద్దేశమేంటో చెప్పు.

స్వదేశ్ : మీ యవ్వారాలన్నీ క్రెడిట్ కార్డుల్తోనేగా జరిగేది. ఇహ మీరు డబ్బు మొహం చూసేదెప్పుడు ? అందుకని మీకు లక్ష్మీదర్శనం లేదన్నాను.

విదేశ్ : అలా అంటావా ? అలాగైతే సరే ! ఒప్పుకున్నాను. మరి ఇండియాలో ఎటు చూసినా డబ్బేనని ఇందాక ఓ గొప్ప స్టేట్ మెంట్ పడేశావు గదా ! ఎక్కడ్రా ? నాకేం కనిపించట్లేదేం ? కొంపదీసి నువ్వీమధ్య గబ్బర్ సింగ్ ముఠాలో గాని చేరావేంటి ?

స్వదేశ్ : ముఠాలెందుకోయ్ ఉద్యోగాలుండగా ? ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పు. మీ దేశంలో ఒక పోలీసాఫీసర్ ఏ మాత్రం సంపాదిస్తాడు ?

విదేశ్ : నెలనెలా జీతమొస్తుంది, ఒక ఇల్లు కడతాడు. రెండు కార్లు ఉండొచ్చు. అది కాక కొద్దిగా స్టాక్స్ లో ఏమైనా పెడతాడేమో ! అంతే !

స్వదేశ్ : ఆపరా బాబూ ! ఇహ చెప్పకు. అమెరికా పేదరికం తల్చుకుంటే నాకు గుండె తరుక్కుపోతోంది. అదే మా దేశంలోనైతే పోలీసాఫీసరంటే సొంత వ్యాపారాలుంటాయి. పరిశ్రమలుంటాయి. కార్లే కాదు, ఏకంగా బస్సులూ, లారీలూ కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉంటుంది. డజన్ ఫ్లాట్ లూ, ఇళ్ళూ ఉంటాయి. ఇద్దరు ముగ్గురు పెళ్ళాలుంటారు. ఏం చేస్తే మీ పోలీసాఫీసర్ మా పోలీసాఫీసర్ తో సమానమవుతాడంటావురా ? మా కానిస్టేబుల్ సంపాదనలో సగం కూడా లేదు గదరా నాయనా మీ పోలీసాఫీసర్ల సంపాదన !

విదేశ్ : మహాప్రభో ! నన్నింక వదిలేయ్. లొంగిపోయాను. పూర్తిగా లొంగిపోయాను. మీ United States of india - ఇదొక ధనికదేశం.

స్వదేశ్ : సో, ఆ పూర్ కంట్రీలో ఉద్యోగం పోయిందని చెప్పి ఊరికే వర్రీ అవకు. ఈ రిచ్ కంట్రీలో నువ్వెలాగైనా హ్యాపీగా బతకొచ్చు. ఇహ వచ్చెయ్... బయల్దేరి మా యింటికొచ్చెయ్.

FINANCE IS NOT ALWAYS NECESSARY FOR SERVING / HELPING PURPOSE

hi friends please go through the following few lines patiently, if u have time....


FINANCE IS NOT ALWAYS NECESSARY FOR SERVING / HELPING PURPOSE

Service means not only financial/ monetary related because for those who are UNWANTED, UNCARED and UNLOVED money is not enough. They need your CARING HEART, a smile, a chat, a kind word, an advice and playing with them etc., It also includes helping the people who are doing these types of activities (in any way). Finally service means a thing which makes them feel that they have somebody to care.

If u have any plans and/or ideas on this type of activities please share with me and I am always ready in this regard and this is my life ambition also. I have some plans and I will share with you.

The above is not complimentary mail, it reminds you that this is the only starting and you have to do more work and be ready for this and keep burning your serving spirit. Collect any information regarding these types of activities if you have any chance.

A collective effort gives great results than an individual effort.

SERVING OTHERS - THE ULTIMATE AIM

We are all human beings i.e. we are next to almighty (GOD). It is not easy to born like this. We proudly got this opportunity and we have to make use of this. THIS LIFE IS NOT FOR US THIS IS FOR OTHERS ONLY. It is purely to help others / serve others. This attitude / quality is there in all of us. Some of them have recognized and striving towards this and in some of them it is slumbering because of his personal and professional problems. In this case this is the right time to wake up that quality. It may not possible to all of us to dedicate entire life towards serving others because of links / burdens created by GOD (Family & Relations). First of all we have to strive for our family goals or needs. After this your job is not over, besides this you have to lead u r life by serving others. It is not such a difficult task. WE CAN, IF WE THINK WE CAN. WHAT EVER THE MIND OF MAN CAN CONCEIVE AND BELIEVE HE CAN ACHEIVE. Service to others not only means financial support, it is only a part. Service means doing something that is not for the sake of you. It may be financial or physical support.

Keep repeating these words daily twice 'THIS LIFE IS FOR OTHERS' and ' I HAVE TO SERVE THE PEOPLE', then you automatically do things in such a way that help others. For this the things you need to develop is, Love people, be Patient, Listen to all, Physical and Mental Fitness. These are all not compulsory but if u have these qualities then u will become good in this area of serving. Apart from this the only thing needed, which is compulsory, is determination and dedication towards serving others.

Charity / Service begin/ come from home. As per this proverb if you start helping in your home to your parent’s then motto of serving others will start and grow rapidly. If you are not able to serve the people in your home, who are very dear and near to you and who are known to you very well, than how can you serve the people who are unknown to you. If you love all the people around you then you will do anything for them. Here itself your aim will begin to work. So people whether they are good or bad, try to elevate good / positives in bad people then they will also become good for you. Even though they are not good to you, you should be good to them. Then they will automatically become good to you.

In today's world everything is related to money. So money is a must for all activities. So you have to spend some money towards servicing activities. It may not be possible for us because of family problems, lowest Salaries or any other financial crisis or whatever it may be, to spent money towards our utmost objective. But there is a way i.e. we can do the same with these drawbacks by using Planning and Budgeting techniques. Don't bother about Planning and Budgeting techniques (like I am not Commerce Graduate then how can I), which means only to plan to save / keep some amount of money from our salaries for our objective in every month. It may starts from Rs.1, 10, 50, 100, 1000, 10,000… so on. It depends on your ability. Everything will starts from 1. So don't bother about the amount it may be small or big. Small savings leads to large and become huge savings. Ex. Save 100/- per month. After 10 month it will become 1000/-. Then you will group with people like you (yours friends, relatives etc.,). If your group contains 10 then your savings will be Rs.10, 000/- if your group or amount increases similarly the total will increase. Hundred may be small for us, not for the poor and needy. So my dear friends I believe we will start this small thing from this month itself.

Don't postpone this by assuming that I will be in a good position after 5 to 10 years, on that day I will have sufficient financial resources and then I will concentrate on all these things.

We may have problems with keeping this amount aside by not using the same for our personal activities. Then a small idea, buy a HUNDI and drop your savings into that. Drop Currency Notes rather than Change because it is difficult to take back the currency notes from storage unit. These all will come if you don't have strong determination. If u have you don't come across any problems.

So my dear friends, start doing the above and within shortly we are going to collect a lacks of rupees and using the same for a noble deed / good cause. If you find any needy person give it to him/her directly or take a demand draft on his/her name.

Hi friends I think it is a long boring session to you, don't think like this, think on this noble deed twice in a day and start real time work, then we will become good human beings which is enough for us for this birth.

Who are not interested in the above don't ignore this mail. Please think a while on this.

A SINGLE PERSON CAN / CAN'T DO SOMETHING

BUT A GROUP OF PERSONS CAN DO ANYTHING

MY AIM IS TO CREATE AWARENESS ABOUT SERVING OTHERS IN ALL OF US. I THINK WE ALL ARE AWARE OF THIS FACT, WHICH IS GOING TO MAKE AN IMPACT ON OUR LIVES. IF U STARTS NOW, IT WILL BECOME A HABIT IN YOUR LIFE.

WE WELCOME YOUR VALUEABLE SUGGESTIONS AND ENHANCEMENTS, FEEL FREE TO MAIL YOUR VIEWS, SUGGESTIONS AND ENHANCEMENTS TO prasadrao.sreenivas@gmail.com OR CALLME @ 9000199263

WE SHOULD LOVE MANKIND

WE SHOULD WORK FOR MANKIND

WE SHOULD BELIEVE IN MANKIND

BECAUSE WE BELONGS TO MANKIND

YOURS EVER,

S.SREENIVASA PRASAD RAO

April, 2007

***********



Always yours


S.Sreenivasa Prasad Rao
Amma Social Welfare Association, Cares for ever...
http://groups.google.co.in/group/amma-social-welfare-association


there is a norm saying without any surity or security, one can avail an education loan up to 4 lakhs

I have come across this interesting incident through one of my friends and felt like sharing this with larger group of same feather here.

This guy (Rohan Kujur) has applied for education loan to complete his master degree in commerce from one of the colleges of west bengal. His appeal was denied by the local PNB bank manager, showing some orbit reason and kept a side.

Rohan applied for an RTI asking the status of his application filed on so and so date. After 30 days, he has been called by the bank manager and granted a loan without asking second question. In fact there is a norm saying without any surity or security, one can avail an education loan up to 4 lakhs. But this was never in practice in our banks. Thanks to RTI.
Rohan was very happy sharing this news when i spoke with him last time.

30, మే 2009, శనివారం

ఆనందంగా జీవించండి

ఎన్నో ఆందోళనలకు,మనశ్శాంతి కరువవడానికి,చేస్తున్న పనులు సరిగా చేయకపోవడానికి ప్రధాన కారణం "మనిషి వర్తమానంలో జీవించకుండా గతంలో జీవించడం,అలాగే భవిష్యత్తును ఎక్కువగా ఊహించుకుంటూ ప్రస్తుతాన్ని సరిగా జీవించలేకపోవడం".ఒక్క విషయం ఇక్కడ మనుషులు గమనించడం లేదు.మన ప్రస్తుత పరిస్థితి గతంలో మనం చేసిన పనుల యొక్క ఫలితం.అలాగే ఇప్పుడు మనం చేయబొయే పనులపైనే మన భవిష్యత్తు ఆధారపడిఉంటుంది.ఇది తెలుసుకోకుండా గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనల గురించి అదేపనిగా బాధపడడం,మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బాధపడడం జరుగుతోంది.తద్వారా ఇప్పుడు అనగా వర్తమానంలో సరిగా పనులుచేయకపోవడం వలన గతకాలపు చేదు జ్ఞాపకాలనూ చెరిపివేయలేము,అలాగే అనుకున్న ఆశావహ భవిష్యత్తునూ జీవించలేరు.
"తప్పులు చేయడం మానవసహజం".కాబట్టి గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడడం మానేసి ఆ తప్పులను మరోసారి చేయకుండా జాగ్రత్తపడాలి.

కాబట్టి జరిగిపోయిన మన చరిత్రను ఒక్కసారి కూలంకుషంగా విశ్లేషించి ఇక ఆ సంఘటనలను పట్టించుకోవడం మానివేసి ప్రస్తుతం చేయబోయే పనులపైన దృష్టి పెట్టాలి.అలాగే చేయబోయే ఏ పనినైనా ముందుగా ఆ పని వలన సంతోషం మిగులుతుందా లేక బాధ ఫలితమవుతుందా అని విశ్లేషించి మొదలుపెట్టాలి.ఇక్కడ ఇంకో విషయం మరిచిపోకూడదు."మన స్వేచ్చ ఇతరులను బాధపెట్టేదైతే మనం స్వేచ్ఛగా ఉండలేము" అన్న విషయం.కాబట్టి మన పనులు సమాజానికి మేలు చేయలేకపోయినా కనీసం హాని మాత్రం చేయరాదు.

అలాగే అనవసరంగా ఎవరినీ అనవసరంగా ద్వేషించకూడదు.మన ద్వేషం వలన ఆ ద్వేషింపబడేవారిలో ఏదైనా మంచి మార్పు వచ్చేటట్టైతే మన ద్వేషానికి అర్థం ఉంటుంది.ద్వేషం వలన మనసూ మనశ్శాంతి పొందలేదు.ఉదాహరణకు మనము మనకు ఇచ్చిన పని మనస్పూర్తిగా చేస్తున్నప్పుడు మన ద్వేషానికి కారణమైన మనిషికానీ,సంఘటన కానీ ఎదురైనా లేక గుర్తువచ్చినా మనకు తెలియకుండానే మన మనసు వికలమయ్యి మన పనికి ఆటంకం అవుతుంది.ఈ విషయాలన్నీ ఆదర్శపూరిత విషయాలని అనుకోవచ్చు.కాని ఏ ఆదర్శంలేని వ్యక్తి కన్నా ఏదో ఒక ఆదర్శం గల వ్యక్తి వలనే సమాజానికి ఉపయోగం ఉంటుందన్న విషయం మనం మరిచిపోరాదు. అప్పుడే మనము వర్తమానాన్నీ ఆనందంగా జీవించగలము మరియు సుందర భవిష్యత్తునూ జీవించగలము.

మన భారతదేశ ప్రాచీన వైజ్ఞానిక గ్రంథాలు-సంక్షిప్త పరిచయంమన భారతదేశ ప్రాచీన వైజ్ఞానిక గ్రంథాలు-సంక్షిప్త పరిచయం

మన భారతదేశ ప్రాచీన వైజ్ఞానిక గ్రంథాలు-సంక్షిప్త పరిచయం

1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

3.శిల్పశాస్త్రం:రచయిత కశ్యపముని.ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

4.సూపశాస్త్రం:రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

5.మాలినీ శాస్త్రం:రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

6.ధాతుశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

7.విషశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం): రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.

9.మల్లశాస్త్రం: రచయిత మల్లుడు.వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.

10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.

11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

12.అర్థశాస్త్రం:రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.

13.శక్తితంత్రం: రచయిత అగస్త్యముని.ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

14.సౌధామినీకళ:రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

15.మేఘశాస్త్రం: రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

16.స్థాపత్యవిద్య:అదర్వణవేదంలోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

భారతదేశం యొక్క ఘనత (ప్రపంచానికి అందించినవి)

1. సున్న("0") ను కనుగొన్నది ఆర్యభటుడు (ఈతని పేరే మన దేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి పెట్టారు)

2.గత 1000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు.3.క్రీ.పూ 700 సంవత్సరంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని తక్షశిలలో నిర్మించారు.ఇక్కడ సుమారు 10,500 మంది ప్రపంచంలోని నలుమూలలనుండి వచ్చి విద్యను అభ్యసించారు.క్రీ.పూ 400 లో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు

3."ఫోర్బ్స్" పత్రిక ప్రకారం కంప్యూటర్ కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతం.

4.పాశ్చాత్యప్రపంచం ఈ మధ్య కనుగొన్న ప్లాస్టిక్ సర్జరీ ని ఏనాడో 2600 సంవత్సరాలకు పూర్వమే సుశ్రుతుడు చేసాడు.

5.దేశప్రాంత పటాలు 5000 సంవత్సరాల పూర్వమే సింధునాగరికత కాలంలోనే మనవారు కనుగొన్నారు.ఆంగ్ల పదం నావిగేషన్ మన సంస్కృత పదం ఐన నవగతిః నుండి వచ్చింది.

6.పైథాగరస్ సిద్దాంతాన్ని,"పై" విలువను మొదటిసారిగా కనుగొన్నది మన భారతీయులే.

7.గ్రీకులు,రోమనులు 10౫ అంకెల వరకు లెక్కించిన కాలంలోనే మనవారు 1053 వరకు లెక్కించారు.

8.1896వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే ఏకైక వజ్రాల ఉత్పత్తిదారు,ఎగుమతిదారు ఒక్క భారతదేశమే.

9.మార్కోని కన్నా ముందే జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలను కనుగొన్నాడు.

10.చదరంగం కనుగొన్నారు.

11.పాశ్చాత్య ప్రజలు ఇంకా అడవులలోనే జీవిస్తున్నకాలం లోనే మనవారు సింధునాగరికత లో ఉన్నారు.

12.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.

మనజాతీయ గీతం

మనజాతీయ గీతం


02వ సెప్టెంబరు, 2008
రవీంద్రనాధ్‌ టాగూర్‌ 1911వ సం.లో మొట్టమొదట బెంగాలీలో రచించిన జనగణమన గీతం, కొన్నాళ్ళపాటు ఆయన సంపాదకత్వం వహించిన ఆర్య సమాజ పత్రిక ‘తత్వబోధ ప్రకాశిక'లో ప్రచురించబడింది. ఆ కాలంలో డా. జేమ్‌‌స హెచ్‌. కజిన్‌‌స అనే ఐరిష్‌ కవి-ఆంధ్రరాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బీసెంట్‌ థియోసాఫికల్‌ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేసేవారు.

కజిన్‌‌స ఆహ్వానం మేరకు 1919వ సం.లో రవీంద్రనాధ్‌ టాగూర్‌ మదనపల్లెకు విచ్చేశారు. ఒక ఫిబ్రవరి మాసం సాయంకాలం, డా. కజిన్‌‌స, ఆయన సతీమణి మార్గరెట్‌, మరికొందరు విద్యార్థులు టాగూర్‌ను ఒక బెంగాలీ పాట పాడమని పట్టుపట్టారు. అప్పుడు టాగూర్‌ ఈ గీతాన్ని ఆలపించారు. చివరి చరణమైన జయహే, జయహే, జయ జయహేకు వచ్చేసరికి శ్రోతలందరూ టాగూర్‌తో ఉత్సాహంగా గొంతులు కలిపారు.

[http://www.chandamama.com/telugu/download/imagestory.php?id=1220353478-0.gif]
టాగూర్‌ మదనపల్లెలో ఉన్నప్పుడే ఆ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. కజిన్‌‌స భార్య దానికి సంగీతం సమకూర్చారు. దానిని గురించి గుర్తు చేసుకుంటూ కజిన్‌‌స ఇలా అన్నారు : ‘‘ఆయన కొన్ని భౌగోళిక ప్రాంతాలను, పర్వతాలను, నదులను కీర్తించే పాటగా దానిని ఆలపించారు... ఆ తరవాత ఆ గీతంలో భారత దేశానికి చెందిన మతాలు కూడా చోటు చేసుకున్నాయి.''

1948, ఆగస్టు 15వ తేదీ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఢిల్లీ ఎరక్రోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినప్పుడు, శిక్ఖు రెజిమెంట్‌ ప్రప్రథమంగా ఆ జాతీయ గీతాన్ని ఆలపించింది. ఆ నాటి నుంచి మనమందరం జాతీయగీతంగా పాడుకుంటున్నాం.












నూరేళ్ళ పండుగ జరుపుకున్న మన జాతీయగేయం-వందేమాతరం.


18వ సెప్టెంబరు, 2008
[http://www.chandamama.com/telugu/download/imagestory.php?id=1221721181-0.gif]బంకించంద్ర చటర్జీ 1875వ సం.లో కలకత్తానుంచి తన స్వగ్రామమైన కాంతాలపడకు రైలులో ప్రయూణం చేస్తున్నారు. కిటికీ నుంచి చూసినప్పుడు అద్భుత ప్రకృతి సౌందర్యం ఆయనకు ఎంతో ఆనందం కలిగించింది. ప్రకృతి మాతను వర్ణిస్తూ గేయరచనకు ఆయనలో ప్రేరణ కలిగింది. వెంటనే ‘వందేమాతరం' గేయం ఆయన కలం నుంచి జాలువారింది. 1882వ సం.లో ఆయన ‘ఆనంద మఠం' అనే నవలను రచించారు.

ఒక సన్యాసుల బృందం బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా రహస్యంగా తిరుగుబాటు జరపడం ఆ సుప్రసిద్ధ నవల ఇతివృత్తం. ఒక సందర్భంలో దేశభక్తులు ‘వందేమాతరం' గేయూన్ని ఆలపించే విధంగా రచయిత కథను మలిచారు. వారణాశిలో 1906వ సం.లో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో విశ్వకవి రవీంద్రనాథ టాగూర్‌ ఈ గేయూన్ని స్వరపరచి, స్వయంగా ఆలపించారు.

అప్పటి నుంచి ప్రతి కాంగ్రెస్‌ సమావేశంలోనూ ‘వందే మాతరం' గేయూన్ని ప్రార్థనాగీతంగా ఆలపించాలన్న నిర్ణయం జరిగింది. భారత రాజ్యాంగ శాసనం-టాగూర్‌ రచించిన జనగణమన గీతాన్ని జాతీయగీతంగానూ, ‘వందే మాతరం' గేయూన్ని దానికి సమాన ప్రతిపత్తిగల జాతీయ గేయంగానూ ఆమోదించింది. ‘వందేమాతరం' గేయూన్ని 1906సం. కాంగ్రెస్‌ సమావేశంలో ఆలపించడాన్ని పురస్కరించుకుని గత సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా ‘వందేమాతరం' గేయం నూరేళ్ళ పండుగ జరుపుకున్నాం.

వికాసానికి 10 వివేకాలు

చదువు... కెరీర్... జీవితం... అన్ని రంగాల్లో దూసుకుపోవడానికి స్వామీ వివేకానంద సూచించిన 'కోటబుల్ కోట్స్' మీకోసం

1. ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

2. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.

3. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.

4. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.

5. పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.

6. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

7. అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.

8. మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.

9. మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం... బలహీనతే మరణమని గుర్తించండి.

10. వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు.

ప్రాచీన భారత శాస్త్రవేత్తలు

సుశ్రుతుడు- శస్త్రచికిత్సా పితామహుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Monday, August 25, 2008 at 1:16:00 PM

[https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjlFH4xWv9AWFuiWT5pzzq8TyErKLV-Qqm7NDqTHm9kOdv3Qcbq2hgvR_qO1Hz25AtAT2ynNwN0T1jhRVMILJdjazG6hE0Tjy2KK1a9GxVG0HG8EjU5Dktb4x0TUScpHwnvUOdsQUyY-PHi/s320/susruthatw3.png]సుశ్రుతుడు క్రీ.పూ 4 వ శతాబ్దమునకు చెందినవాడు.ఇంతకు మించి వీరి వృత్తాంతము తెలియరావడం లేదు.

వీరు ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు.మరియు మత్తుమందు ఉపయోగించడంలోనూ,కంటి శుక్లాలు తొలగించడంలోనూ,మూత్రపిండరాళ్ళు తొలగించడంలోనూ మరియు విరిగిన ఎముకలు అతికించడంలోనూ అనుభవజ్ఞులు.
ప్రక్క చిత్రాలలో సుశ్రుతుడు శస్తచికిత్స చేయడాన్ని మరియు అతడు ఉపయోగించిన పరికరాలను చూడవచ్చు.

[https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifGFMMKs8z3V53PznGBAt9mr4mC06dyZvsOwWfn8Yr14WVkRPFZLj9B9TyT4EJFDO2UrrmGojTgUnOZ-_qUEJVBjEx5AIL-LkGDcOKjbC7GadIFcjU5uqrr4rDK5-gQ8FvdNgBy08uzAuK/s320/images.jpg]
ప్రపంచంలో మొట్టమొదట సిజేరియన్ చేసినది కూడా వీరే.

ఇతని మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ వృత్తాంతం చరిత్రలో క్రిందివిధంగా నమోదు చేయబడింది.
"ఒక రాత్రి ఒక ప్రమాదన్లూ దాదాపు ముక్కును కోల్పోయిన ప్రయాణికుడు సుశ్రుతుని తలుపు తట్టాడు.అతని ముక్కు నుండి రక్తం ధారాళంగా ప్రవహిస్తోంది.సుశ్రుతుడు మొదట అతని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఏవో ఆకులను పిండి ఆ ఆకురసమును అతని ముక్కుపై పిండాడు.తర్వాత అతనికి కొద్దిగా ద్రాక్షరసం(వైన్) త్రాగడానికి ఇచ్చాడు.తర్వాత అతని ముక్కు పొడవును ఒక ఆకుతో కొలిచి అతని గడ్డం నుండి కొద్దిగా మాంసం ముక్కను కోశాడు.ఆ రోగి బాధతో మూలిగాడు కానీ ద్రాక్షరసం ప్రభావం వలన అతనికి నొప్పి తెలియలేదు.
తర్వాత గడ్డానికి కట్టుకట్టి రెండు గొట్టాలను ముక్కు రంధ్రాలలో పెట్టి ముక్కుతెగినచోట మాంసం ముక్కను ఉంచాడు.అక్కడ ఏదో మందుపొడిని,ఎర్ర చందనమును పూశాడు.మరియు మంగళివారు ఉపయోగించే లోహాన్ని ప్రవేశపెట్టాడు.తర్వాత నువ్వులనూనె తో పత్తిని తడిపి దానితో ఆ ముక్కుకు కట్టుకట్టాడు."

ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 26 శతాబ్దాలముందే చేయబడిన "ప్లాస్టిక్ సర్జరీ".వీరు ఈ విద్యలో కాశీ లోని దివోదశధన్వంతరి అను వారినుండి ప్రావీణ్యత సాధించారు.

వీరు రచించిన ప్రపంచప్రసిద్ద గ్రంథం "సుశ్రుతసంహిత".ఇందులో దాదాపు 101 రకాల శస్తచికిత్సకు ఉపయోగించే పరికరాలను తెలిపాడు.వీటికి జంతువులను సూచించు పేర్లను పెట్టాడు.





సుశ్రుతుడు- శస్త్రచికిత్సా పితామహుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Monday, August 25, 2008 at 1:16:00 PM

[https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjlFH4xWv9AWFuiWT5pzzq8TyErKLV-Qqm7NDqTHm9kOdv3Qcbq2hgvR_qO1Hz25AtAT2ynNwN0T1jhRVMILJdjazG6hE0Tjy2KK1a9GxVG0HG8EjU5Dktb4x0TUScpHwnvUOdsQUyY-PHi/s320/susruthatw3.png]సుశ్రుతుడు క్రీ.పూ 4 వ శతాబ్దమునకు చెందినవాడు.ఇంతకు మించి వీరి వృత్తాంతము తెలియరావడం లేదు.

వీరు ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు.మరియు మత్తుమందు ఉపయోగించడంలోనూ,కంటి శుక్లాలు తొలగించడంలోనూ,మూత్రపిండరాళ్ళు తొలగించడంలోనూ మరియు విరిగిన ఎముకలు అతికించడంలోనూ అనుభవజ్ఞులు.
ప్రక్క చిత్రాలలో సుశ్రుతుడు శస్తచికిత్స చేయడాన్ని మరియు అతడు ఉపయోగించిన పరికరాలను చూడవచ్చు.

[https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifGFMMKs8z3V53PznGBAt9mr4mC06dyZvsOwWfn8Yr14WVkRPFZLj9B9TyT4EJFDO2UrrmGojTgUnOZ-_qUEJVBjEx5AIL-LkGDcOKjbC7GadIFcjU5uqrr4rDK5-gQ8FvdNgBy08uzAuK/s320/images.jpg]
ప్రపంచంలో మొట్టమొదట సిజేరియన్ చేసినది కూడా వీరే.

ఇతని మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ వృత్తాంతం చరిత్రలో క్రిందివిధంగా నమోదు చేయబడింది.
"ఒక రాత్రి ఒక ప్రమాదన్లూ దాదాపు ముక్కును కోల్పోయిన ప్రయాణికుడు సుశ్రుతుని తలుపు తట్టాడు.అతని ముక్కు నుండి రక్తం ధారాళంగా ప్రవహిస్తోంది.సుశ్రుతుడు మొదట అతని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఏవో ఆకులను పిండి ఆ ఆకురసమును అతని ముక్కుపై పిండాడు.తర్వాత అతనికి కొద్దిగా ద్రాక్షరసం(వైన్) త్రాగడానికి ఇచ్చాడు.తర్వాత అతని ముక్కు పొడవును ఒక ఆకుతో కొలిచి అతని గడ్డం నుండి కొద్దిగా మాంసం ముక్కను కోశాడు.ఆ రోగి బాధతో మూలిగాడు కానీ ద్రాక్షరసం ప్రభావం వలన అతనికి నొప్పి తెలియలేదు.
తర్వాత గడ్డానికి కట్టుకట్టి రెండు గొట్టాలను ముక్కు రంధ్రాలలో పెట్టి ముక్కుతెగినచోట మాంసం ముక్కను ఉంచాడు.అక్కడ ఏదో మందుపొడిని,ఎర్ర చందనమును పూశాడు.మరియు మంగళివారు ఉపయోగించే లోహాన్ని ప్రవేశపెట్టాడు.తర్వాత నువ్వులనూనె తో పత్తిని తడిపి దానితో ఆ ముక్కుకు కట్టుకట్టాడు."

ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 26 శతాబ్దాలముందే చేయబడిన "ప్లాస్టిక్ సర్జరీ".వీరు ఈ విద్యలో కాశీ లోని దివోదశధన్వంతరి అను వారినుండి ప్రావీణ్యత సాధించారు.

వీరు రచించిన ప్రపంచప్రసిద్ద గ్రంథం "సుశ్రుతసంహిత".ఇందులో దాదాపు 101 రకాల శస్తచికిత్సకు ఉపయోగించే పరికరాలను తెలిపాడు.వీటికి జంతువులను సూచించు పేర్లను పెట్టాడు.





కణాదుడు(ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Friday, August 22, 2008 at 12:08:00 PM

పరమాణువుల గురించి పాశ్చాత్యులకన్నా ముందే కనుగొన్నవారు కణాదుడు.

వీరి తల్లిదండ్రుల గురించి,జన్మించిన స్థలం గురించి,మరణ వృత్తాంతం తెలియ రావడం లేదు.
వీరు క్రీ.పూ.6 వ శతాబ్దంలో జన్మించారు.వీరి అసలు పేరు కశ్యపుడు.చిన్నప్పటినుండే వీరు సునిశిత జ్ఞానం కలవారు.చిన్నచిన్న విషయాలను కూడా వీరు ఆసక్తిగా గమనించేవారు.

ఒకసారి వీరు ప్రయాగకు వారి నాన్న తో పాటు వెళ్ళారు.అక్కడి దారులపైన భక్తులు చల్లిన పూలు,బియ్యం గమనించి భక్తులు పూజల్లో నిమగ్నులై ఉందగా ఇతను మాత్రం ఆ గింజల్ని లెక్కించడం మొదలుపెట్టాడు.అది చూసి సోమశర్మ అను ఋషి చూసి ఎందుకలా లెక్కిస్తున్నావని అడిగాడు.అప్పుడు కణాదుడు ఆ గింజలు ఎంత చిన్నవైనప్పటికీ ఈ విశ్వంలో భాగమేకదా అన్నాడు.
ఈ విధంగా కణాదుడికి చిన్నచిన్న విషయాలపైన కూడా దృష్టి ఉండడంచూసి ఆ ఋషి అతనికి "కణాదుడు"(కణ అనగా ధాన్యపుగింజ) అని పేరుపెట్టాడు.

వీరు కనుగొన్నవి:
#ప్రపంచంలో మొట్టమొదట పరమాణుసిద్దాంతం ప్రతిపాదించారు.
#ఒక అణువులో కనీసం రెండు పరమాణువులు ఉంటాయని కనుగొన్నారు.
#ప్రతిపదార్థానికి మూలం పరమాణువులే అని వటిని విభజించలేమని,అవి కనపడవని తెల్పాడు.(ఇప్పుడు వాటినికూడా విభజించవచ్చని కనుగొన్నారు,కానీ ఆ కాలం లో కణాదుడిలా కనీసం ఎవరూ అణువును కూడా ఊహించలేకపోయారు).

కణాదుడు వైశేషికదర్శనం(మిగతా దర్శనాలు న్యాయ,సాంఖ్య,మీమాంస మొదలగునవి)ప్రతిపాదించాడు.ఇందులో విజ్ఞాన,మత మరియి వేదాంతాల సమన్వయం ఉంది.ఈ దర్శనాలు నవీన శాస్తజ్ఞులను ఆశ్చర్యపరుస్తున్నాయి.





ఆర్యభట్ట (భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Monday, August 18, 2008 at 6:48:00 PM

భారతదేశం కన్న శాస్త్రవేత్తలలో ఆర్యభట్టు ప్రాతఃస్మరణీయుడు. ప్రపంచానికి సున్న("0") ను అందించిన గొప్పవాడు.

ఆర్యభట్ట క్రీ.శ. 476 వ సంవత్సరంలో పాటలీపుత్రంలో(నేటి పాట్నా)లో జన్మించాడు.కానీ చాలామంది ఇతడు కేరళలో జన్మించి,పాటలీపుత్రంలో స్థిరపడ్డాడని వాదనలు ఉన్నాయి.కాని వీటికి ఆధారంలేదు.ఇతడు వర్తక కుటుంబానికి చెందినవాడు.వీరి తల్లిదండ్రులు,జీవితం గురించి అంతగా పరిశోధన జరగలేదు.

ఏదేమైనప్పటికీ ఆర్యభట్టు తన సుప్రసిద్ద ఆర్యభట్ట సిద్దాంతం(ఆర్యభట్టీయం) పాటలీపుత్రంలోనే రచించాడనడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు.

గణితంలో ఇతని ఘనకార్యాలు:

1.ఇప్పుడు మనము పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న విషయాలైన "భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం,భూమి చుట్టు చంద్రుడు తిరగడం" గురించి ఆనాడె తన గ్రంథం లో పేర్కొన్నాడు.
2.4 కు 100 కూడి వచ్చినదాన్ని 8 తో హెచ్చవేసి తర్వాత 62,000కు కూడి వచ్చినదాన్ని 20,000తో భాగిస్తే వృత్తపరిధి మరియు వృత్తవ్యాసం నిష్పత్తికి సమానమని చెప్పాడు.దీని విలువ 3.1416 అని చెప్పాడు.గమనించి చూస్తే ఇదే గణితంలోని "పై"విలువ అని తెలుస్తుంది.ఆధునిక గణితం ప్రకారం ఈ విలువ 3.14159.చూడండి ఆనాడే ఇతను ఎంత సరిగా విలువ గణించాడో.
3.చంద్రుని వెలుతురు సూర్యరశ్మి పరావర్తనంవలన కలుగుతుందని చెప్పాడు.
4.గ్రహణాలు రాహు,కేతువులవలన కాదు అని అవి ఒకే వరుసలోకి వచ్చినప్పుడు కలుగుతాయని గ్రంథంలో పొందుపరచాడు.
5.సంవత్సరానికి 365 రొజులని కూడా చెప్పాడు.
6.భూమి యొక్క చుట్టుకొలత 24385 మైళ్లని (నేటి విజ్ఞానం ప్రకారం ఇది 24900 మైళ్ళు) అని కనుగొన్నాడు.
తర్వాతికాలంలో ఇతని గ్రంథాన్ని గ్రీకులు,అరబ్బులు గ్రహించారు.

వీరు క్రీ.శ.550 లో మరణించారు.







భాస్కరాచార్యుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Thursday, July 31, 2008 at 3:22:00 PM

సనాతన భారతదేశం కన్న గణితశాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు.ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్యశాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి.చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు.పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత,గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్( విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.చిన్నపటి నుండే గణితం లో అనేక పరిశొధనలు ప్రారంభించాడు.వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట.ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్దతి ఏమిటంటే కుండలలో ఇసుక,నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను,శుభాశుభాలను లెక్కించేవాడు.ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు.తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు.కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది.ముహూర్తనిర్ణయానికి ముందు లీలావతి ఒకరోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది.ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క,పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు.ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను మరియు లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు.ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు,సిద్దాంతాలు కనుగొని ప్రపంచప్రఖ్యాతుడయ్యాడు.తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

సిద్దాంత శిరోమణి గ్రంధం ( భాస్కరులు ప్రపంచానికి అందించిన కానుక)

1150వ సంవత్సరం లో రచించిన "సిద్దాంత శిరోమణి" అను గ్రంధం భాస్కరులకు ఖ్యాతిని గణితప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది.
ఇందులో భాగాలు నాలుగు.
అవి ౧.లీలావతి(అంకగణితం)
౨ .బీజగణితం
౩.గోళాధ్యాయ(గోళాలు,అర్దగోళాలు)
౪.గ్రహగణితo (గ్రహాలకు,నక్షత్రాలకు సంబంధించినది)
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను,వర్గాలను,వర్గమూలాలను,ధనాత్మక-ఋణాత్మక అంకెలను,వడ్డీలెక్కలను,సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు,వర్గ సమీకరణాలను,అనంతం (ఇంఫినిటి)ని కనుగొని చర్చించి,వాటిని సాధించింది.సమీకరణాలను వాటి 3వ,4వ ఘాతం వరకు సాధించింది.త్రికోణమితిని కూడా చాలా చర్చించింది.

మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము.. కాని ఈ గ్రంధంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి.కాబట్టి భూమి,గ్రహాలు,చంద్రుడు,నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి.వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి."

ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.

తర్వాతి కాలంలో వీరు ఉజ్జయిని లోని ఖగోళగణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడయ్యారు.

వీరు మరణించిన సంవత్సరం 1183 లేక 1187.

21, మే 2009, గురువారం

Amma Social Welfare Association

”To do something to others is not a social service, it is our social responsibility”