1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

17, సెప్టెంబర్ 2011, శనివారం

అనంతపద్మనాభ వ్రతం




Gurukrupa


అనంతపద్మనాభ వ్రతం

Posted: 16 Sep 2011 12:30 PM PDT

భాద్రపద శుక్ల చతుర్దశినాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారు. కష్టాలనుండి బైటపడటానికి ఈ వ్రత ఫలితం తోడ్పడుతుంది. వనవాస కాలంలో కృష్ణుని ద్వార ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అనంతుడు అన్న, అనంతపద్మనాభుడు అన్న ఒకరే. పాలకడలిలో శేష తల్పమున పవళించి, బొడ్డు పద్మo లో బ్రహ్మదేవుడు కూర్చొని, లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య మంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. అనంత - అంతము లేనివాడు, పద్మనాభుడు - పద్మము నాభిలో కలవాడు అని.


ఇక వ్రత విషయానికొస్తే, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 7 పడగలు కల (14 పడగలు చేస్తరు కొందరు) అనంతుడిని దర్భలతో చేసి ప్రతిష్టిస్తారు. ముందుగా గణాధిపతిని పూజించాలి. కలిశంలో సిద్ధం చేసుకొన్న పవిత్ర జలములకి "యమున పూజ" చేయాలి అంటే యమునా నదిని ఆవహన చేయడం. తరువాత అనంతుడికి షోడశోపచారాలతో పూజచేసి బెల్లము, నేతితో చేసిన 28 అరిసెలను నైవేద్యముగా పెట్టాలి. వ్రత కథ చదువుకొని, తోరాన్ని కట్టుకోవాలి. ఎరుపు రంగులో 14 పోచలతో తోరాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలి.

ఈ అనంత వ్రతంలో మనకు స్పష్టముగా తెలిసేది 14 కి చాల ప్రాముఖ్యం ఉంది అని. అవి
14 లోకాలను ఏలే వాడు కనుకనే ఈ వ్రతంలో 14 లేక 7 పడగలు కల అనంతుడిని ప్రతిష్ట చేసి పూజిస్తారు
14 కి రెండింతలైన 28 సంఖ్యలో పిండివంటలను నైవేద్యం పెట్టడం
14 ముడులు కల తోరాన్ని ధరించడం
14 సంవత్సరలకి ఒకసరి ఉద్యాపన చేయడం.
ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తలచుకోడం కోసమే ఈ వ్రతం. ఈ వ్రతాన్ని పురోహితుడి ద్వార వివరంగా తెలుసుకొని చేయడం మంచిది.





కామెంట్‌లు లేవు: