1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు

మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు

22nd January, 1949 

భక్తుడు : స్వామి, కళ్ళు మూసి ఉంచి ధ్యానములో కూర్చుంటే పర్వాలేదు కాని, అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏమి చెయ్యమంటారు?

రమణ మహర్షి: కళ్ళు తెరచి ఉంచినంత మాత్రాన ఏమి అవుతుంది? ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరచుకుని నిద్రపోతావో అలాగే మనసును నిద్ర పోయేలా చెయ్యగలిగితే కళ్ళు తెరచి ఉంచినా ఇబ్బంది ఉండదు.

భక్తుడు: మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా, దానిని నియంత్రించుట మాకు సాధ్యపడడం లేదు స్వామి.

రమణ మహర్షి:అవును అది నిజమే. ఎలాగయితే చిన్న పిల్లవాడు తన నీడను తానూ పట్టుకోవాలని పరిగెడుతూ, పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుందో, అదే విధముగా మనము కూడా మన మనస్సు ఎటూ వెళ్ళకుండా అడ్డుకోవాలి.

భక్తుడు : ఎలా అడ్డుకోగలం స్వామి?

రమణ మహర్షి : వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానము చేయుట ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు.

భక్తుడు: అంటే మనము బాహ్య సుఖాలను వదిలి పెట్టి , ఆత్మానందమును అనుభవించాలి అనా స్వామి?

రమణ మహర్షి : ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందము మన స్వభావము. దాని కోసము మనము ఎక్కడ వెతకక్కరలేదు.

భక్తుడు: అది అంతా సరే స్వామి, కాని మేము ఎంత కృషి చేసినా మా మనస్సును అదుపులో పెట్టడం మా వాళ్ళ కావటం లేదు. ఏమి చెయ్యమంటారు?

రమణ మహర్షి : నవ్వుతూ...తన చేతి వేలిని కంటిపై పెట్టుకుని, " చూడండి. ఈ చిన్న చేతి వేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడ కుండా చేస్తోంది. అలాగే ఈ చిన్ని మనస్సు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మ జ్ఞానమునకు అడ్డు పడుతుంది. చూడండి అది ఎంత సక్తివంతమైనదో ."

Source: Letters from and Recollections of Sri Ramanasramam Book


రమణ మహర్షి

భగవాన్ శ్రీ రమణ మహర్షి
Ramana 3 sw.jpg
జననం:30 డిసెంబరు 1879
జన్మస్థలం:థిరుఛి
అసలు పెట్టిన పేరు:వెంకట్రామన్ అయ్యర్
మరణం:14 ఏప్రిల్ 1950 (వయస్సు 70)
మరణ స్థలం:తిరువణ్ణామలై
వేదాంతం/తత్వం:అద్వైత వేదాంతము
ఉపదేశం:మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేనుఅనునది.
శ్రీ రమణ మహర్షి (ఆంగ్లం : Sri Ramana Maharshi) (తమిళం : ரமண மஹரிஷி)(డిసెంబరు 30,1879 – ఏప్రిల్ 141950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడుతిరుచుజై లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు 16 సంవత్సరాల వయస్సులో మోక్షము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై తన బసను ఏర్పాటు చేసుకున్నాడు.[1] బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షము పొందిన తరువాత తనను "అతియాశ్రమి" గా ప్రకటించుకున్నాడు.[2].
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". ఇతను చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే ప్రసంగాల రూపంలో బోధనలు చేపట్టేవాడు. [3] ఇతని బోధనలలోనూ విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.[4] ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, దీనిద్వారా మాత్రమే మోక్షము సాధ్యమని బోధించేవాడు. తన బోధన అద్వైతంజ్ఞానయోగా లతో ముడివడియున్ననూ,భక్తిని ప్రధానంగా బోధించేవాడు.[5]

విషయ సూచిక

  [దాచు

[మార్చు]కుటుంబ నేపధ్యం

శ్రీ రమణ మహర్షి గా ప్రఖ్యాతి గాంచిన ఈ మహానుభావుడికి తల్లి తండ్రులు పెట్టిన పేరు 'వెంకట్రామన్ అయ్యర్'. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం' నాడు జన్మించారు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అయగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు(నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వారు.

[మార్చు]బాల్యం

పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవారు. అపారమైన దేహదారుడ్యుం కలిగిఉండేవారు. బాల్యం లో చదువు మీద ఆసక్తి చూపించేవారు కాదు. తిరుచోళ్ళి గ్రామం లో సరైన విద్యాసౌకార్యం లేక పోవడం కారణం చేత వాళ్ళ చిన్నాన వద్దకు (సుబ్బాయ్యర్) వేళ్ళారు. రమణులు చిన్నతనం లో బాగా నిద్ర పోయేవారు, ఏలాంటి నిద్ర అంటే తోటి పిల్లాలు ఆయన నిద్రపోయినాప్పుడు పిల్లాలు ఆయన్ని నడిపించి దూరంగ తీసుకువేళ్ళి బాదిన ఆయనకు తేలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వార అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బాయ్యర్ గారు నాగస్వామి(రమణ గారి అన్నయ్య),రమణ లను మధురాయ్ తిసుకుని వేళ్ళిపోయారు. రామస్వామి అయ్యార్ అనే ఆయన అరుణాచలం వేళ్ళివస్తుండగా రమణ లు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగారు, ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చేప్పగా , ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తేలియని గోప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానివేసారు.

[మార్చు]బోధనలు

స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". ఇతడి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవాడు.[5]
  • "The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
  • It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
  • "In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."

[మార్చు]భగవాన్ గురించి చలం

  • భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.
  • చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి వున్నారు. ఆ తరవాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, వొక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో!

కామెంట్‌లు లేవు: